తణికెళ్ల భరణి తదుపరి చిత్రం హీరో, టైటిల్
హైదరాబాద్ : నటుడు నుంచి దర్శకుడుగా మారిన తణికెళ్ల భరణి తన తదుపరి చిత్రానికి హీరోని ఎన్నుకున్నారు. మినిస్టర్ గంటాశ్రీనివాసరావు కుమారుడు గంటా రవి హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. జనార్దన మహర్షి మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ప్రేమయాత్రలకు బృందావనం అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని చెప్తున్నారు.

తణికెళ్ల భరిణి మాట్లాడుతూ... ఇప్పటివరకు 800 చిత్రల్లో పలు వైవిధ్యమైన పాత్రలు పోషించాను. ప్రస్తుతం ఆగడు సినిమాలో తమన్న తండ్రి పాత్రలోను, బందిపోటు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అన్నారు.
సినిమాలతో తీరిక లేకుండా ఉన్నా తన సాహితీ సాన్నిహిత్యాన్ని ఆయన మరిచిపోరు. అహంకారం, ఆధిపత్య ధోరణి లేని వ్యక్తిత్వం ఆయనది. ఆయన రచనల్లో ఆ వ్యక్తిత్వం వ్యక్తమవుతూ ఉంటుంది. ఆయన చిన్న చిన్న విషయాలను తీసుకుని సమాజంలోని దుర్నీతిపై తన పదునైన అక్షరాలతో కత్తులు దూస్తారు.


Click it and Unblock the Notifications











