twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గోలీమార్' గోపీచంద్

    By Staff
    |

    వైష్ణో ఆకాడమీ బ్యానర్ పై 'ఇడియట్', 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి', 'పోకిరి' వంటి బ్యాక్ బస్టర్స్ అందించిన సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇటీవల గోపీచంద్ హీరోగా ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. దీనిని వైష్ణో అకాడమీ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందించనున్నట్టు పూరీ జగన్నాథ్ ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి 'గోలీమార్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. గోపీచంద్ సినిమాలకు చివర్లో సున్నా ఉంటే పెద్ద హిట్టవుతుందనే సెంటిమెంట్ కు భిన్నంగా పూరీ జగన్నాథ్ ఈ టైటిల్ ను ఎంపిక చేసుకోవడం విశేషం.

    'యజ్ఞం', 'రణం', 'లక్ష్యం' 'శౌర్యం' వంటి హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న గోపీచంద్ ప్రస్తుతం 'శంఖం' చిత్రంలో నటిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈనెల 11న విడుదలవుతోంది. ఈ చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్ సినిమాకి గోపీచంద్ కమిట్ అయ్యారు. పూరీ జగన్నాథ్ సైతం ప్రభాస్ కథానాయకుడు 'ఏక్ నిరంజన్' చిత్రాన్ని ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు పూరీ నిర్మాతగా తన సోదరుడు సాయిరాం శంకర్ తో వైష్ణో అకాడమీ బ్యానర్ పై నిర్మిస్తున్న 'బంపర్ ఆఫర్' షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో గోపీచంద్ చిత్రాన్ని నవంబర్ లో ప్రారంభించి 2010 ఏప్రిల్ 28న సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేసేందుకు పూరీ జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్ ప్లే బాధ్యతలను కూడా ఆయన చేపడుతున్నారు. ప్రస్తుతం హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X