Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'గోలీమార్' గోపీచంద్
వైష్ణో ఆకాడమీ బ్యానర్ పై 'ఇడియట్', 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి', 'పోకిరి' వంటి బ్యాక్ బస్టర్స్ అందించిన సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇటీవల గోపీచంద్ హీరోగా ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. దీనిని వైష్ణో అకాడమీ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందించనున్నట్టు పూరీ జగన్నాథ్ ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి 'గోలీమార్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. గోపీచంద్ సినిమాలకు చివర్లో సున్నా ఉంటే పెద్ద హిట్టవుతుందనే సెంటిమెంట్ కు భిన్నంగా పూరీ జగన్నాథ్ ఈ టైటిల్ ను ఎంపిక చేసుకోవడం విశేషం.
'యజ్ఞం', 'రణం', 'లక్ష్యం' 'శౌర్యం' వంటి హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న గోపీచంద్ ప్రస్తుతం 'శంఖం' చిత్రంలో నటిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈనెల 11న విడుదలవుతోంది. ఈ చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్ సినిమాకి గోపీచంద్ కమిట్ అయ్యారు. పూరీ జగన్నాథ్ సైతం ప్రభాస్ కథానాయకుడు 'ఏక్ నిరంజన్' చిత్రాన్ని ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు పూరీ నిర్మాతగా తన సోదరుడు సాయిరాం శంకర్ తో వైష్ణో అకాడమీ బ్యానర్ పై నిర్మిస్తున్న 'బంపర్ ఆఫర్' షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో గోపీచంద్ చిత్రాన్ని నవంబర్ లో ప్రారంభించి 2010 ఏప్రిల్ 28న సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేసేందుకు పూరీ జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్ ప్లే బాధ్యతలను కూడా ఆయన చేపడుతున్నారు. ప్రస్తుతం హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.