Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రభాస్ కు గోపీచంద్ ఓకే
తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలు రావడం చాలా అరుదు. ప్రస్తుతం కమల్ హాసన్, వెంకటేష్ నటించిన 'ఈనాడు' చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. ఈ నేపథ్యంలో హీరో గోపీచంద్ మాట్లాడుతూ తాను మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి సిద్ధంగా వున్నానని అంటున్నాడు. అంతే కాకుండా మల్టీస్టారర్ చిత్రాల వల్ల సినీపరిశ్రమకు లాభాలపంట పండుతుందని చెప్పుకొచ్చాడు.
అంతే కాకుండా తనకు ఎప్పటినుంచో ప్రభాస్ తో కలిసి నటించాలని వుందని తన కోర్కెను వెలిబుచ్చాడు. 'వర్షం' చిత్రంలో తాను విలన్ గా నటించగా, ప్రభాస్ హీరోగా నటించాడని ఎవరైనా మంచి కథతో వస్తే ఇద్దరం కలసి ఓ సినిమా చెయ్యాలనుకున్నట్టు చెప్పాడు. మరి గోపీచంద్ ఆఫర్ కి ప్రభాస్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
కానీ హీరోల మధ్య బేషజాలు తగ్గి మల్టీస్టారర్ సినిమాలు ఊపందుకొంటే అది సినీపరిశ్రమకు ఎంతో మేలని, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని సినీవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.