twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్యూరిటీ గార్డు గా హీరో గోపీచంద్

    By Srikanya
    |

    గోపీచంద్, యేలేటి చంద్రశేఖర్ ల కాంబినేషన్ లో ఆ మధ్యన ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో గోపీచంద్ సెక్యూరిటీ గార్డుగా కనపించనున్నాడని సమాచారం. తాప్సీ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ లడఖ్ లో త్వరలో ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రం నిధి వేట చుట్టూ తిరగనుంది. పూర్తి స్ధాయి ఎడ్వెంచర్స్ తో మెకన్నాస్ గోల్డ్ తరహా కథాంసంతో ఈ చిత్రం గోపీచంద్ కెరీర్ లో నెంబర్ వన్ గా నిలవనుందని చెప్తున్నారు.

    గోపీచంద్-చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో వచ్చిన 'ఒక్కడున్నాడు' చిత్రం తర్వాత మళ్లీ అయిదేళ్ల విరామం తీసుకుని వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ తమ శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై.లి. సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ- ''ఇదొక సాహసంతో కూడుకున్న యాక్షన్ చిత్రం. ప్రపంచదేశాలన్నింటిలో ప్రమాదకరమైనదిగా పరిగణించే ఓ దేశంలో అతివిలువైన ఓ నిధి ఉంటుంది. ఆ నిధిని ఓ సామాన్యుడు ఎలా సాధించాడు అనేది ఈ సినిమా కథాంశం. కథకు తగ్గట్టు జోర్డాన్, రాజస్థాన్, లడక్‌లలో చిత్రీకరణకు ప్లాన్ చేశాం. ఇందులో గోపీచంద్ పాత్ర, ప్రవర్తన భిన్నంగా ఉంటాయి. ఈ ఆధునిక యుగంలో జరిగే ట్రెజర్ హంట్ ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తుంది'' అన్నారు.

    హీరో గోపీచంద్ మాట్లాడుతూ..''చందు కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. డబ్బు మనిషిని శాసిస్తున్న అంశం. ఈ కథ కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కథతో తేలిగ్గా ప్రయాణం చేయగలుగుతారు. కథ విని ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. కచ్ఛితంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది భిన్నమైన కథ. సమాజంలో మనిషికీ, మనీకీ మధ్య చాలా లింకు ఉంది. అందుకే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది'' అని చెప్పారు.

    నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ- ''గోపీచంద్, చంద్రశేఖర్ ఏలేటిలతో సినిమా చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరింది. చందు తయారు చేసిన స్క్రిప్ట్ గోపీచంద్‌కు చాలా బాగుంటుంది. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాం. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ప్రశాంత్ అట్లూరి, సుమలత, కెమెరా: శామ్‌దత్, సంగీతం: శ్రీ, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్.

    English summary
    Gopichand is busy acting in Yeleti Chandra Sekhar’s upcoming film. Sources from the film unit revealed that Gopichand is acting in the role of a security guard in this flick. The shooting schedule in Ladakh is going to be started soon. Tapsee is zeroed in the role of female lead in this film. BVSN Prasad is producing this flick.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X