Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
డైరక్టర్ కి కాజల్, హీరోకి అనుష్క కావాలంటూ పట్టు
బి.గోపాల్, గోపీచంద్ ల కాంబినేషన్లో రూపొందనున్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా అనుష్క కావాలని గోపీచంద్ పట్టుపడుతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందులోనూ ఈ చిత్రం నిర్మాత నల్లమలుపు బుజ్జి గతంలో అనుష్క, గోపీచంద్ కాంబినేషన్లో లక్ష్యం చిత్రాన్ని రూపొందించి సూపర్ హిట్ కొట్టారు. దాంతో బుజ్జి కూడా అటువైపే మొగ్గు చూపుతున్నాడని అంటున్నారు. అయితే దర్శకుడు బి గోపాల్ మాత్రం కాజల్ హీరోయిన్ గా పెడితే కథకు న్యాయం చేసినట్లుంటుందని వాదిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రంకి రసూల్ ఎల్లోర్ కెమెరా వర్క్ చేస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుంటే మస్కా చిత్రానికి కథ అందించిన సూర్య ఈ చిత్రానికి కథ ఇస్తున్నారు. జూన్ ఏడు నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇక ఇప్పటికీ మాత్రం హీరోయిన్ అనుష్క, కాజల్ అనేది డిసైడ్ కాలేదు. ఇంతకీ ఎవరు బావుంటారు అంటారు.