Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గోపీచంద్ సినిమా ఎన్టీఆర్ కమిటయ్యాడా?
గోపీచంద్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో చిత్రం చేయటానికి సింహా ప్రారంభం కావటానికి ముందు చాలా కాలం సిట్టింగ్స్ నడిచాయి. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించటానికి ముందుకొచ్చారు. అయితే కొద్ది రోజులు అయిన తర్వాత కథ నచ్చలేదంటూ గోపీచంద్ రిజెక్టు చేయటం, ఆ తర్వాత ప్రభాస్ కి చెప్పటం, ఆఖరున బాలయ్యకు చెప్పటం, ఓకే కావటం, సూపర్ హిట్ కావటం అంతా స్పీడుగా జరిగిపోయాయి. అయితే కె.ఎస్.రామారావు దగ్గర చిత్రం చేస్తానని మాట ఇచ్చి ఎడ్వాన్స్ తీసుకున్న బోయపాటి ఆ మాటను నిలబెట్టుకోవటానికి రెడీ అయ్యారు. అయితే గోపీచంద్ తో చిత్రం కాకుండా ఎన్టీఆర్ తో కావటం విశేషం. దాంతో గోపీచంద్ చేయాల్సిన స్లాట్ లోకి ఎన్టీఆర్ వచ్చినట్లయిందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఈ మేరకు కథా చర్చలు ప్రారంభమయ్యాయి. భద్ర, తులసి, సింహా తర్వాత ఎలాంటి హిట్ కొడతాడో అని అంతా ఎదురుచూస్తున్నారు.