Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఆనంద ప్రసాద్ తో గోపీచంద్ మరో సినిమా
గోపిచంద్ హీరోగా కెమెరామెన్ శివ ని డైరక్టరక్ గా పరిచయం చేస్తూ శౌర్యం చిత్రాన్ని నిర్మాత ఆనంద్ ప్రసాద్ రూపొందించిన సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్ పై వచ్చిన ఆ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. అదే విజయాన్ని కొనసాగించటానికి గోపీచంద్ మరోసారి అదే బ్యానర్ పై చిత్రం చేయటానికి సైన్ చేసారని విశ్వసనీయ సమాచారం. దర్శకుడుగా ఓ తమిళయన్ పరిచయం కానున్నాడని తెలుస్తోంది. ఇక స్టోరీ సిట్టింగ్ లలో గోపీచంద్ ఇన్వాల్స్ అవుతున్నారని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం గోపిచంద్..పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో గోలీమార్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రియమణి హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవిత చరిత్ర ఆధారంగా తయారవుతోంది. అలాగే గోపీచంద్, పరుశరామ్(యువత ఫేమ్) దర్శకత్వంలో కూడా ఓ చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆనంద ప్రసాద్..శౌర్యం అనంతరం అల్లరి రవిబాబు దర్శకత్వంలో అమరావతి చిత్రం రూపొందించారు. అది భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.