Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హ్యాట్రిక్ పై కన్నేసిన గోపీచంద్, ఆ దర్శకుడితో సినిమా!
విభిన్నమైన కథ, కథనాలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తాజాగా మోహన్ లాల్ తో మనమంతా సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. విమర్శకుల ప్రశంశలు పొందించి ఆ సినిమా. మనమంతా సినిమా విడుదల తరువాత ఈ డైరెక్టర్ చెయ్యబోతున్న సినిమా పై క్లారిటి వచ్చింది.
ఇటీవల చంద్ర శేఖర్ యేలేటి సాయి ధరమ్ తో సినిమా చేయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి. నిజానికి సాయి ధరమ్ తేజ్ కూడా ఈ డైరెక్టర్ తో సినిమా చెయ్యాలి అనుకున్నాడు కాని.. కరుణాకరన్ సినిమా విడుదల తరువాత ఈ సినిమా స్టార్ట్ చేద్దామని సాయి చెప్పినట్లు తెలుస్తోంది. కాని చంద్ర శేఖర్ యేలేటి సాయితో సినిమా చెయ్యడం లేదని తాజా సమాచారం.
సాయి ధరమ్ కు చెప్పిన పాయింట్ గోపీచంద్ కు చెప్పాడని సమాచారం. త్వరలో వీరి కాంబినేషన్ సినిమా స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సాహసం, ఒక్కడున్నాడు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అదే తరహాలోనే ఈ సినిమా ఉండబోతోందేమో చూడాలి. గోపీచంద్ నటించిన తాజా సినిమా పంతం పై అభిమానులకు మంచి అంచనాలు ఉన్నాయి.