Don't Miss!
- News 527 భారత ఫుడ్ ఐటమ్స్ లో క్యాన్సర్ కారకాలు-జాబితాలో ఇవే- ఈయూ గుర్తింపు..!
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
హ్యాట్రిక్ పై కన్నేసిన గోపీచంద్, ఆ దర్శకుడితో సినిమా!
విభిన్నమైన కథ, కథనాలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తాజాగా మోహన్ లాల్ తో మనమంతా సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. విమర్శకుల ప్రశంశలు పొందించి ఆ సినిమా. మనమంతా సినిమా విడుదల తరువాత ఈ డైరెక్టర్ చెయ్యబోతున్న సినిమా పై క్లారిటి వచ్చింది.
ఇటీవల చంద్ర శేఖర్ యేలేటి సాయి ధరమ్ తో సినిమా చేయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి. నిజానికి సాయి ధరమ్ తేజ్ కూడా ఈ డైరెక్టర్ తో సినిమా చెయ్యాలి అనుకున్నాడు కాని.. కరుణాకరన్ సినిమా విడుదల తరువాత ఈ సినిమా స్టార్ట్ చేద్దామని సాయి చెప్పినట్లు తెలుస్తోంది. కాని చంద్ర శేఖర్ యేలేటి సాయితో సినిమా చెయ్యడం లేదని తాజా సమాచారం.
సాయి ధరమ్ కు చెప్పిన పాయింట్ గోపీచంద్ కు చెప్పాడని సమాచారం. త్వరలో వీరి కాంబినేషన్ సినిమా స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సాహసం, ఒక్కడున్నాడు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అదే తరహాలోనే ఈ సినిమా ఉండబోతోందేమో చూడాలి. గోపీచంద్ నటించిన తాజా సినిమా పంతం పై అభిమానులకు మంచి అంచనాలు ఉన్నాయి.