Don't Miss!
- Sports PBKS vs MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గోపీచంద్ కొత్త చిత్రం టైటిల్ ‘మొగుడు’!
గోపీచంద్ , కృష్ణవంశీ కాంబినేషన్ లో శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'మొగుడు" (హజ్బెండ్) అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రం హీరో గోపీచంద్. వాంటెడ్ చిత్రం ప్లాప్ తో ఉన్న గోపీచంద్ ఈ కాంబినేషన్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో గోపీచంద్ తో లక్ష్యం చిత్రం నిర్మించిన నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం బుజ్జి ఆఫీసులో ఈ కొత్త ప్రాజెక్టుకు సంభందించిన స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక కృష్ణవంశీ కి నాగార్జున, రామ్ చరణ్ లతో కమిట్మెంట్స్ ఉన్నాయి.
అయితే నాగార్జునతో చిత్రం చేద్దామనుకుంటే నిర్మాత సి.కళ్యాణ్ ప్రస్తుతం సూరి హత్య కేసు వ్యవహారంలో ఇరుక్కుని ఉన్నారు. రామ్ చరణ్ ప్రాజెక్టు కి మెగా క్యాంప్ లో ఆమోదముద్ర పడలేదు. దాంతో ఆ రెండూ లేటయ్యేటట్లు ఉన్నాయని గోపీచంద్ తో ముందుకు వెళ్థున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రెడీ చేయాలని స్క్రిప్టుపై కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు యేలేటి చద్రశేఖర్ ..ఒక్కడున్నాడు చిత్రం షూటింగ్ సమయంలో గోపంచంద్ తో పాటలను కృష్ణవంశీనే తీసి పెట్టినే అనుభవం ఉంది.