twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పులిని చూసి నక్క వాతలు పెట్టుకొందట

    By Staff
    |

    ప్రస్తుత రోజల్లో చాలా మంది హీరోయిన్స్ తెలుగులో నటించి, వారి చిత్రాలు హిటైనా, ప్లాప్ అయినా బాలీవుడ్ లోకో, కోలీవుడ్ లోకో, మోలీవుడ్ లోకో జంప్ అవ్వడానిక విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. స్టేట్ బాడర్స్ ను దాటి సినిమా ఇండస్ట్రీలో సిగ్గు ఎగ్గు లేకుండా ఇతర భాషల్లో నటించడానికి మగ్గు చూపుతున్నారు. అలాంటి తారల్లో ఒక్కరైన మమతా మోహన్ దాస్ టాలీవుడ్ లో అడపదడప చేసిన సినిమాలు కింగ్, యమదొంగ, కష్ణార్జున యుద్దం లాంటి సినిమాలు మంచి గుర్తింపు వచ్చినా అశించిన ఫలితాలు, అవకాశాలు మాత్రం శూన్యం అయింది. అయితే మళయాళంలో మాత్రం పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు మెండుగా రావడంతో మంచి ప్రేక్షకాదరణ పొదుతోంది.

    మరి అదే దారిని ఫాలో అవుతున్న మరో కథానాయిక రబ్బరు బొమ్మ 'గౌరీ ముంజాల్" 'బన్ని", 'గోపి గోడమీద పిల్లి", కౌసల్య సుప్రజ రామ" వంటి చిత్రాల్లో నటించినా అవి మాత్రం నిరాశనే మిగిల్చాయి. తెలుగులోనే కాకుండా ఇటు తమిళం, అటు కన్నడ పలు సినిమాల్లో నటించిన తెలుగులో అగ్ర హీరోల సరసన నటించే అవకాశం కానీ సరైన సక్పెస్ ని కానీ అందుకోలేక పోయింది. దాంతో చిర్రెత్తిన గౌరీ ముంజాల్ తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకు ప్రస్తుతానికి స్వస్తి చెప్పి మళయాల చిత్రసీమలో కాలు మోపింది. ఏకంగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. 'పలేరే మాణిక్యం" పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది. మరి అక్కడ 'గౌరీ ముంజాల్" టాలెంట్ తో అదృష్టమెంతో పరిక్షించుకోబోతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X