Don't Miss!
- News తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించిన సీఎం జగన్
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బూతు మోతాదు బాగా దట్టించారా?
హైదరాబాద్ : దర్శక,నిర్మాత మారుతికి బూతు ముద్రపోయేటట్లు కనపడటం లేదు. ఆయన డైరక్ట్ చేసినా లేక నిర్మించినా లేక సమర్పించినా ఏ విధంగా సినిమా విషయంలో వేలు పెట్టినా అది ఖచ్చితంగా బూతు సినిమానే అయ్యింటుంది అని ఫిక్స్ అవుతున్నారు. దాంతో ఆయన పేరు చూపించి కొత్త చిత్రం వస్తోందంటే అందులో బూతు ఉందా లేదా అని ఎక్వైరీ చేస్తున్నారు. తాజాగా 'గ్రీన్ సిగ్నల్' గురించి ట్రేడ్ వర్గాలు అందులో బూతు మోతాదు దట్టించాడా లేదా అని ఎక్వైరీ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే దర్శకుడు మాత్రం డబుల్ మీనింగ్ డైలాగులే ఉండవని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు.
రేవంత్, రక్షిత, మానస్, మనాలి, అశుతోష్, డింపుల్ చోపడే, శిల్పిశర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా 'గ్రీన్ సిగ్నల్'. ఈ నెల 30న విడుదల కానుంది. ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై తెరకెక్కింది. మారుతి సమర్పిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. విజయ్ మద్దాల దర్శకుడు.
దర్శకుడు మాట్లాడుతూ "సొసైటీలో రిలేషన్స్ ఎలా ఉంటున్నాయనే విషయాన్ని చెబుతున్నాం. నాలుగు జంటలుంటాయి. ప్రతి పనికీ పాజిటివ్ గ్రీన్ సిగ్నల్ రావాలని చెప్తున్నాం. డబుల్ మీనింగ్ డైలాగులుండవు. యూత్తో పాటు ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా ఇది'' అని అన్నారు.
సమాజం అంటే వివిధ జీవితాల సమ్మేళనం. ఒక్కో జీవితం నుంచి ఒక్కో కొత్త విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇలాంటి నాలుగు యువ జంటల కథలను మా సినిమాలో చూపిస్తున్నామంటున్నారు విజయ్ మద్దాల. ఆయన దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం 'గ్రీన్ సిగ్నల్'. రేవంత్, రక్షిత, మానస్, మనాలి, అశుతోష్, డింపుల్ చోపడే, శిల్పి శర్మ ప్రధాన పాత్రధారులు. రుద్రపాటి రమణారావు నిర్మాత. ఈ నెల 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్రబృందం ఇటీవల హైదరాబాద్లో మీడియాతో మాట్లాడింది. ''జె.బి. సంగీతమందించిన పాటలకు మంచి స్పందన వస్తోంది. స్వామి ఛాయాగ్రహణం సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది'' అన్నారు నిర్మాత. చిత్ర సమర్పకుడు మారుతి మాట్లాడుతూ ''ఇటీవల తుది కాపీ చూశాను. దర్శకుడు సినిమాను చక్కగా తీశాడు. ఏడాదిపాటు చిత్రబృందం పడ్డ కష్టానికి మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.