Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
ప్రభాస్ పెళ్లి గురించి హాట్ టాపిక్... గుంటూరుకు లింకు, ఆ అమ్మాయేనా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న 39వ వసంతంంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన ఫేస్ బుక్ పేజీ ద్వారా 23న ఓ స్పెషల్ న్యూస్ మీతో పంచుకోబోతున్నాను అని చెప్పడంతో ప్రభాస్ నుంచి ఎలాంటి గుడ్ న్యూస్ రాబోతోంది అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆ రోజు 'సాహో' సినిమాకు సంబంధించిన సర్ప్రైజ్తో పాటు ప్రభాస్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉందంటున్నారు. అది మరేదో కాదు బాహుబలి స్టార్ పెళ్లి వార్త అనే అని అంటున్నారు.
గుంటూరులో సందడి
ప్రభాస్ గుంటూరుకు చెందిన అమ్మాయిని పెళ్లాడబోతున్నాడనే వార్తలు ప్రచారంలోకి రావడంతో అక్కడి అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రభాస్ పెళ్లాడబోయే అమ్మాయి ఎవరయి ఉంటారు? అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
బంధువుల అమ్మాయేనంట
ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు, ఇతర కుటుంబ సభ్యులు కొన్ని రోజులుగా వధువును వెతికే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎట్టకేలకు ప్రభాస్కు సరిజోడైన అమ్మాయిని గుంటూరులో కనుకొన్నారట. ప్రభాస్ కూడా ఓకే చెప్పడంతో ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఆవిడ ప్రభాస్ బంధువల అమ్మాయే అని అంటున్నారు. అక్టోబర్ 23న ఇందుకు పూర్తి వివరాలు రివీలయ్యే అవకాశం ఉంది.
ఆ వార్తల్లో నిజం లేనట్లేనా?
కొన్ని రోజులుగా ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ఈవిషయాన్ని ఖండించినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇటీవల ప్రభాస్ను కలిసేందుకు అనుష్క విదేశాలకు వెళ్లినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. గుంటూరు మ్యాటర్ తర్వాత ప్రభాస్-అనుష్క పెళ్లి వార్తల్లో నిజం లేదని చాలా మంది నమ్ముతున్నారు.
ప్రభాస్
ప్రభాస్ సినిమాల విషయానికొస్తే... బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో' మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు కెకె రాధామోహన్ దర్శకత్వంలో మరో సినిమాలో సైతం ప్రభాస్ నటిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.