Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. సరిగ్గా ఐదు రోజుల్లో వీరికి డబ్బే డబ్బు
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
బంపర్ ఛాన్స్ కొట్టేసిన హెబ్బా పటేల్.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్
ముంబై బ్యూటీ హెబ్బా పటేల్ గుర్తుందిగా! పాతికేళ్ల ఈ పాప బోల్డ్గా నటించడంలో ఎంత దిట్ట అనేది అందరికీ తెలిసిందే. పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన ఈ భామకు తెలుగులో 'కుమారి 21 ఎఫ్' మంచి బ్రేక్ ఇచ్చింది. అయినప్పటికీ ఆశించిన మేర అవకాశాలు మాత్రం కరువయ్యాయి. దీంతో ఇక ఆమె కెరీర్ ముగిసినట్లే అనుకున్నారంతా. కానీ ఇంతలో ఈమె లేడీ విలన్ గా మారిందనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా 'భీష్మ'. ఈ సినిమాలో నితిన్ సరసన నాయికగా రష్మిక మందన నటిస్తుండగా వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ ఆశ్చర్యపరుస్తోంది.
స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర ఒకటుందట. ఈ పాత్ర సినిమాకే ఎంతో కీలకం అని సమాచారం. అయితే ఈ పాత్రలో హెబ్బా పటేల్ అయితే బాగుంటుందని భావించిన చిత్రయూనిట్.. ఆమెను సంప్రదించగా వెంటనే ఓకే చెప్పేసిందట. ఈ క్రేజీ వార్త ఫిల్మ్నగర్లో వైరల్ అవుతోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయమేమిటంటే.. ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రల్లో నటించిన హెబ్బా నెగెటివ్ షేడ్స్ పాత్రకు సెలెక్ట్ కావడం. ఇదే నిజమైతే విలన్ గా హెబ్బా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి మరి.