Don't Miss!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
సుకుమార్ దృష్టిలో పడింది..లక్ తిరిగినట్లే
హైదరాబాద్ : సుకుమార్ లాంటి స్టార్ డైరక్టర్ దృష్టిలో పడటమంటే మాటలు కాదు. వారి అదృష్టం తిరిగినట్లే. అలాంటి అవకాసం ఇప్పుడు అలా ఎలా చిత్రం ఫేమ్ హీబా పటేల్ సొంతం చేసుకుందని సమాచారం. అయితే ఆయన డైరక్ట్ చేస్తున్న చిత్రం కోసం కాదు ఆమెను ఎంపిక చేసింది. ఆయన నిర్మిస్తున్న కుమారి ఎఫ్ 21 చిత్రం కోసం ఆమెను తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
https://www.facebook.com/TeluguFilmibeat
సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం కోసం మొదట షీనా బజాజ్ ని ఎంపిక చేసారు. అయితే కారణాలు తెలియదు కానీ ఆమెను డ్రాప్ అయ్యి హీబా పటేల్ కు అవకాసమిచ్చినట్లు తెలుస్తోంది. సుకుమార్ ఈమెను రికమెండ్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. రాజ్ తరణ్ సరసన ఫెరఫెక్ట్ ఛాయిస్ అని చెప్తున్నారు.
చిత్రం వివరాల్లోకి వెళితే..
స్టార్ డైరెక్టర్ సుకుమార్ సమర్పణలో `ఉయ్యాల జంపాల' ఫేం రాజ్తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా `కుమారి 21 ఎఫ్'. పి.ఎ.మోషన్ పిక్చర్స పతాకంపై విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి నిర్మిస్తున్నారు. `కరెంట్' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు.
సుకుమార్ మాట్లాడుతూ-``నిర్మాతగా తొలి ప్రయత్నమిది. నిర్మాత కష్టాలేంటో ఈ సినిమాతో తెలుస్తుంది. రత్నవేలు, దేవిశ్రీ కథ విని, స్నేహానికి విలువిచ్చి అంగీకరించారు ఇది సున్నితమైన పాయింట్తో తెరకెక్కుతున్న చక్కని ప్రేమకథా చిత్రం. రాజ్ తరుణ్ చక్కని పెర్ఫామెన్సతో స్క్రీన్ మొత్తాన్ని ఆక్రమిస్తాడని నా నమ్మకం'' అన్నారు.
దర్శకుడు ప్రతాప్ మాట్లాడుతూ ‘‘సుకుమార్ చక్కని స్ర్కిప్ట్తోపాటు అద్భుతమైన టెక్నిషియన్లను కూడా ఇచ్చారు. నాకు ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఇది'' అని తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ ‘‘జనవరి మొదటి వారానికి సినిమా పూర్తి చేసి, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చెయ్యాలనుకుంటున్నాం'' అని అన్నారు. ‘‘ఆర్య సినిమా వచ్చిన పదేళ్ళకి నేనూ, సుకుమార్, రత్నవేలు కలిసి పనిచేస్తున్న చిత్రమిది'' అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. ‘‘నేను చిన్న హీరోని. పెద్ద టీమ్తో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది'' అని హీరో రాజ్ తరుణ్ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: పొట్లూరి వెంకటేశ్వరరావు, కెమెరా: ఆర్.రత్నవేలు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్.