twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RC15: 20 నిమిషాలకే 20 కోట్లు ఖర్చు.. చరణ్ కోసం శంకర్ భారీ సాహసం

    |

    మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు టాలీవుడ్ బడా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న అతడు.. ఆ తర్వాత కూడా చాలా విజయాలను సొంతం చేసుకున్నాడు. తద్వారా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి అస్సలు వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఫలితంగా తన క్రేజ్‌తో పాటు మార్కెట్‌ను విస్తృతం చేసుకుంటున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నాడు.

    శృతి మించిన యాంకర్ స్రవంతి హాట్ షో: బ్లేజర్ విప్పేసి మరీ దారుణంగా!శృతి మించిన యాంకర్ స్రవంతి హాట్ షో: బ్లేజర్ విప్పేసి మరీ దారుణంగా!

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే RRR (రౌద్రం రుధిరం రణం) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ మూవీతో సంచలన విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన 'ఆచార్య' మాత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ స్టార్ హీరో తన తదుపరి చిత్రాన్ని దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్‌తో చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం దీన్ని అధికారికంగా మొదలెట్టేశారు. అంగరంగ వైభవంగా ప్రారంభం అయిన ఈ సినిమా.. ఆరంభంలోనే దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అందరి దృష్టినీ తిప్పుకున్న విషయం తెలిసిందే.

    Huge Budget for Ram Charan and S. Shankar Movie Climax

    రామ్ చరణ్ - ఎస్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత డిసెంబర్‌లోనే మొదలైంది. మొదటి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న చిత్ర యూనిట్ రాజమహేంద్రవరంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో రెండో షెడ్యూల్‌ను జరుపుకుంది. అక్కడి ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. ఇక, ఇటీవలే ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలోని సముద్ర తీరంలో జరిగింది. అక్కడ రామ్ చరణ్‌పై జనసందోహం మధ్యలో కీలకమైన సన్నివేశాలను షూట్ చేశారు.

    హీరోయిన్ దారుణమైన ఫొటో వదిలిన వర్మ: ఆమె బాడీలో ఏ పార్ట్ బాలేదు అంటూ!హీరోయిన్ దారుణమైన ఫొటో వదిలిన వర్మ: ఆమె బాడీలో ఏ పార్ట్ బాలేదు అంటూ!

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ క్లైమాక్స్ పార్ట్‌ను హై లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారట. ఇక, ఈ ఎపిసోడ్‌లో బ్లాస్టింగ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయట. అందుకే దీనికి ఎక్కువ బడ్జెట్‌ను కేటాయించారని తెలిసింది. ఈ ఒక్క పార్ట్ కోసమే దాదాపు రూ. 20 కోట్లు కేటాయించారని ఓ న్యూస్ లీకైంది. ఈ సీక్వెన్స్ 20 నిమిషాలు పాటు ఉండబోతుందని అంటున్నారు. అంటే ఒక్కో నిమిషానికి ఒక్కో కోటి అన్నట్లుగా బడ్జెట్‌ను ప్లాన్ చేసుకున్నారు. ఇక, ఈ విషయం తెలిసిన తర్వాత ఎంతైనా శంకర్ సినిమా కదా.. ఆ మాత్రం బడ్జెట్ ఉండడం ఆశ్చర్యం కాదులే అని జనాలు అనుకుంటున్నారు.

    శంకర్ గత చిత్రాల మాదిరిగానే పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ డుయల్ రోల్ చేస్తున్నాడని కూడా తెలుస్తోంది. ఇక, ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు 'సిటిజన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

    English summary
    Mega Power Star Ram Charan Now Doing a film with S. Shankar. Producers will Spent Huge Budget for This Movie Climax Part.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X