Allu Arjun నెవ్వర్ బిఫోర్ స్ట్రాంగ్ లైనప్.. ఏకంగా నాలుగు బిగ్ బడ్జెట్ సినిమాలు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. మొదటి పార్ట్ కంటే మరింత గ్రాండ్ గా పుష్ప 2 చిత్రాన్ని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ గ్యాప్ లేకుండా ఇప్పటికే దర్శకులని లైన్ లో పెట్టేశాడు. AA22 సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని తర్వాత AA23 చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఉంటుందని ఇప్పటికే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. టి-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

24 లేదా 25 సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ చేయనున్నాడంట. అయితే ఈ రెండింటిలో ఏ ప్రాజెక్ట్ ఉంటుందనేది క్లారిటీ రావడానికి మరో రెండేళ్ళ సమయం పట్టొచ్చు. ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేసే ఛాన్స్ ఉందంట. అయితే ఈ మూవీకి సంబంధించి ప్రశాంత్ నీల్ నుంచి ఎలాంటి హామీ ఇంకా రాలేదు. అయితే గీతా ఆర్ట్స్ మాత్రం అతని కోసం ట్రై చేస్తోంది.
పుష్ప 2 భారీ బ్లాక్ బస్టర్ అందుకునే మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ పాన్ ఇండియా లెవల్ లో మరింత గ్రా గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ అన్ని కూడా పాన్ ఇండియా లెవల్ లో యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలతోనే బన్నీ చేసే ఛాన్స్ ఉంది. అతని మార్కెట్ రేంజ్ పెరగనున్న నేపథ్యంలో నిర్మాతలు కూడా వందల కోట్ల రూపాయిలు బడ్జెట్ పెట్టడానికి పెద్దగా భయపడకపోవచ్చు.
ఇప్పటికే పుష్ప సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ తో దేశవ్యాప్తంగా భారీ హైప్ సొంతం చేసుకుంది. దానికి తగ్గట్లుగానే సినిమాకి మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయని టాక్. ఆడియో, హిందీ శాటిలైట్ రైట్స్ ని టి-సిరీస్ ఇప్పటికే భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











