Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'అష్టాచెమ్మా' దర్శకుడు కొత్త చిత్రం టైటిల్
ఇక సుమంత్ అశ్విన్ ఆ మధ్య 'తూనీగ తూనీగ'తో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. భాక్సాపీస్ వద్ద ఈ చిత్రం పరాజయం పాలైనా ఈ కుర్రాడికి మంచి మార్కులే పడ్డాయి. దాంతో అశ్విన్ రెండో చిత్రానికి తాజాగా రంగం సిద్ధమైంది. గ్రహణం, అష్టాచమ్మా, మాయాబజార్, గోల్కొండ హైస్కూల్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో అశ్విన్ చేయబోతున్నారు.
'అలా మొదలైంది' వంటి సూపర్ హిట్ చిత్రం అందించిన తర్వాత కె.దామోదర్ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం కథ కొన్నాళ్లుగా స్క్రిప్టు వర్క్ జరిగింది. దర్శక, నిర్మాతలు, హీరో ఈ స్క్రిప్టు మీద మంచి నమ్మకంతో ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి కల్యాణి మాలిక్ స్వరాలందిస్తారు. వివేక్ కూచిభొట్ల ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది.
ఇక 'తూనీగ తూనీగ' తర్వాత సుమంత్ అశ్విన్ కి చాలా ఆఫర్స్ వచ్చినట్లు సమాచారం. వరుణ్ సందేశ్ కు ప్రత్యన్మాయంగా ఈ యంగ్ హీరోని చాలా మంది సంప్రదించారు. అయితే మంచి కథ,కథనం కుదిరితేనే తన తదుపరి చిత్రం ఓకే చేయాలనే ఆగినట్లు సమాచారం. అందులోనూ 'తూనీగ తూనీగ'చిత్రం బడ్జెట్ పరంగా,నిర్మాణ విలువల పరంగా రిచ్ గా ఉన్నా కథ,కన్థనం సరిగ్గా లేకపోవటంతో ఫలితం లేకుండా పోయింది. దాంతో ఎమ్.ఎస్ రాజు తన కుమారుడుతో చేయాలనుకునే వారు దర్సకుడు,కథ,బ్యానర్ ఈ మూడు ముఖ్యము అన్నట్లుగా చూస్తున్నట్లు సమాచారం.