Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
డ్యూయిల్ రోల్...ఇంద్రజ హీరోయిన్.. రాజమౌళి శిష్యుడు
హైదరాబాద్ : రాజమౌళి మరో శిష్యుడు త్రికోఠి దర్శకుడుగా తన ప్రతిభను నిరూపించుకోవటానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. నెగిటివ్ పాత్రలు పోషించే అజయ్ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి 'దిక్కులు చూడకు రామయ్య' అనే టైటిల్ ని పెట్టారు. ఇందులో అజయ్ ..ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అతని సరసన ఇంద్రజని ఎంపిక చేసారు. తండ్రి,కొడుకులుగా ఈ చిత్రంలో అజయ్ చేస్తున్నాడని తెలుస్తోంది. తండ్రి పాత్రకు జోడిగా ఆమెను ఎంపిక చేసారని తెలుస్తోంది. వారాహి చలన చిత్రం సంస్థ తెరకెక్కిస్తోంది. రజని కొర్రపాటి నిర్మాత.
అజయ్, శౌర్య, ఇంద్రజ, సనాఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం 'దిక్కులు చూడకు రామయ్య'. ఉగాది రోజున ఈ చిత్రం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాత మాట్లాడుతూ... ''వినోదాత్మక ప్రేమకథ ఇది. త్రికోఠి చెప్పిన కథ కొత్తగా ఉంది. మా సంస్థ నుంచి వచ్చిన హిట్ చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా నిలుస్తుంది'' అన్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం అవుతోంది.
అజయ్ ఆ ఒక్కడే చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. తర్వాత సారాయి వీర్రాజు చిత్రంతో మరోసారి హీరోగా పలకరిస్తే అదీ వర్కవుట్ కాలేదు. అయితే ఈ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
రాజమౌళి మొదటి నుంచీ అజయ్ ని నటుడుగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం ప్రారంభమవ్వటానికి కూడా రాజమౌళి అండదండలే కారణమంటున్నారు. ఈ చిత్రంలో అజయ్ పాత్ర చాలా డిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. అతను సరసన ముగ్గురు హీరోయిన్స్ చేస్తున్నారు.
ఈగ చిత్రంతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా, అందాల రాక్షసి చిత్రంతో ఉత్తమాభిరుచిగల నిర్మాతగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న సాయి కొర్రపాటి ఈ చిత్రం నిర్మాత కావటంతో ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఇదే బ్యానర్ నుంచి విడుదలైన బాలకృష్ణ లెజండ్ చిత్రం ఘన విజయం సాధించిన నేపధ్యంలో ఈ చిత్రం ప్రారంభించారు. ఈ చిత్రంలోనూ అన్ని కమర్షియల్ విలువలూ ఉన్నాయని చెప్తున్నారు.
నాగినీడు, అలీ, విశాల్, రమేష్, హరితేజ, వేణు తదితరులు నటిస్తున్నారు. అజయ్, శౌర్య, ఇంద్రజ, సనాఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాటలు: రమేష్ - గోపి, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: బి.వి.అమరనాథ్రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, సంగీతం: కీరవాణి.