జనవరి ఒకటవ తేదిన రిలీజైన ఇందుమతి సినిమాలో హీరోయిన్ గా చేసిన శ్వేతా భరధ్వాజ్ ఇప్పుడు నిర్మాతలు తనని ఛీట్ చేసారంటూ గోలెత్తుతోంది.మొదట ఈ సినిమా కోసం ఇరవై లక్షలు ఇస్తానని నిర్మాతలు ప్రామిస్ చేసారని అయితే నాలుగు లక్షలిచ్చి సరిపెట్టారని ఆమె ఆరోపిస్తోంది.అప్పటికీ నిర్మాతలు తనకు కొంత ఎక్సపోజింగ్ సినిమాకు చేయాల్సి ఉంటుందని చెప్పటంతో అలాగేనని ఆ మేరకే రేటు చెప్పానని తర్వాత ఫైనాన్సియల్ సమస్యలు ఉన్నాయని ముందు సినిమా పూర్తయి బయిటపడితే సెటిల్ చేస్తామన్నారని..కానీ ఎగ్రిమెంట్ ఏదీ రాసుకోకపోవటంతో తనను రిలీజ్ తర్వాత పట్టించుకోలేదని వాపోతోంది. పోనీ మీడియా ముందు ఈ విషయాలు చెప్పవచ్చు కదా అని సూచించిన శ్రేయాభిలాషులకు ఆమె అటుంవంటిది జరిగితే తను అల్లరి పాలవటమే కాక తర్వాత అవకాశాలు కూడా రావని భయపడుతున్నానని చెప్తోంది. అయినా సినిమా ఫ్లాఫ్ అయ్యాక ఏ నిర్మాత డబ్బు తిరిగి పే చేస్తాడని సీనియర్స్ కామెంట్ చేస్తున్నారు. సో..కష్టమేనేమో..