Don't Miss!
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- News బీజేపీకి అనపర్తి సీటు కేటాయింపు వెనుక వైసీపీ..!?
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Finance Rain Tax: ఆ నగరంలో ప్రజలపై వర్షం టాక్స్..! ఏప్రిల్ నుంచి దబిడిదిబిడేనా..??
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
ఉత్కంఠ రేపుతున్న నాని, విక్రమ్ కుమార్ సినిమా.. ఐదుగురు హీరోయిన్లు.. లిస్టులో రష్మిక!
నేచురల్ స్టార్ నాని ప్లే బాయ్ గా మారిపోతున్నాడు. ఇప్పటివరకు నాని అనేక ప్రేమ కథలు చేశాడు. ఆ చిత్రాల్లో రొమాన్స్ డీసెంట్ గా ఉంటుంది. కానీ తొలిసారి నాని రొమాన్స్ తో చెలరేగిపోనున్నాడట. నానితో ఈ ప్రయోగం చేయిస్తోంది మరెవరో కాదు.. దర్శకుడు విక్రమ్ కుమార్. వీరిద్దరి కాంబినేషన్ లో ఇటీవల ఓ చిత్రం ఖారైన సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలు బ్రేక్ వేసాయి. అందుకే తదుపరి చిత్రాల విషయంలో నాని భిన్నమైన కథలు ఎంచుకుంటున్నాడు.
నాని, విక్రమ్ కుమార్ సినిమా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా తెరకెక్కించాలని విక్రమ్ కుమార్ ఎంతగానో ప్రయత్నించారు. కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రాజెక్ట్ ఒకే కాలేదు. దీనితో విక్రమ్ కుమార్ నానిని లైన్ లో పెట్టాడు. ఈ చిత్రానికి ఇటీవలే ప్రకటన కూడా జరిగింది. నేను, విక్రమ్ కుమార్.. మిగతా ఐదుగురు అంటూ నాని ట్వీట్ చేశాడు. అమ్మాయిలూ ఈ చిత్రం మీ కోసమే అంటూ కూడా ఆసక్తి పెంచాడు.
ఆ ఐదుగురు అంటే
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఐదుగురు అంటే.. ఈ చిత్రంలో నాని సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తారని వార్తలు వస్తున్నాయి. నానిని విక్రమ్ కుమార్ పూర్తిగా ప్లే బాయ్ గా మార్చేస్తునట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లని కూడా విక్రమ్ కుమార్ ఎంపిక చేసారని అంటున్నారు. నాని హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన, రాశి ఖన్నా, నివేత థామస్ ఉన్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
బిజీ బిజీగా నాని
విక్రమ్ కుమార్, నాని చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నాని గౌతమ్ తిన్ననూరి దర్శత్వంలో క్రికెట్ నేపథ్యంలో సాగే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ కోసం నాని ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. మరో వైపు నాని చంద్రశేఖర్ యేలేటి దర్శత్వంలో నటించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
మైత్రి మూవీస్
నాని, విక్రమ్ కుమార్ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మించనుంది. ఐదుగురు హీరోయిన్లు నటించే సినిమా అంటే ఒకరకంగా ఇది నానికి ప్రయోగాత్మక చిత్రమే. అదే సమయంలో ఆడియన్స్ లో ఉత్కంఠ పెరుగుతుంది. విక్రమ్ కుమార్ సినిమాలు ఆడియన్స్ కు థ్రిల్ కలిగించే విధంగా ఉంటాయి. ఈ చిత్రంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.