Don't Miss!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహర్షి, సైరా గురించి జోరుగా ప్రచారం.. అలా జరిగితే భారీ నష్టమే.. మహేష్, చిరు ఇద్దరికీ!
Recommended Video
సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే కానుకగా విడుదలైన మహర్షి ఫస్ట్ లుక్ తో అదరగొట్టాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రం రూపొందుతోంది. మహర్షి చిత్ర షూటింగ్ లో మహేష్ బిజీగా పాల్గొంటున్నాడు. అంతే బిజీగా మెగాస్టార్ సైరా షూటింగ్ షూటింగ్ కూడా జరుగుతోంది. సైరా చిత్రం కోసం టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు సంబంధించి ఆసక్తికర విషయం ప్రచారం జరుగుతోంది.
మహేష్, చిరు ఇద్దరికీ
సూపర్ స్టార్ మహేష్ కు మహర్షి చిత్రం, మెగాస్టార్ చిరంజీవికి సైరా నరసింహారెడ్డి చిత్రం చాలా ప్రతిష్టాత్మకమైనవి. మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం మహర్షి. ఇక మెగాస్టార్ రి ఎంట్రీ తరువాత చేస్తున్న భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి.
జోరుగా ప్రచారం
సోషల్ మీడియాలో జోరుగా ఈ రెండు చిత్రాల గురించి ప్రచారం జరుగుతోంది. ఈ రెండు చిత్రాల విడుదల తేదీలు క్లాష్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019 సమ్మర్ లోనే ఈ రెండు చిత్రాలు విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
నష్టమే భారీ నష్టమే
భారీ బడ్జెట్, ఊహకు అందని అంచనాలతో మహర్షి, సైరా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ రెండు చిత్రాల కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారనడంలో సందేహం లేదు. ఒకవేళ ఈ రెండు చిత్రాలు ఒకేసారి విడుదలైతే కలెక్షన్ల విషయంలో భారీ నష్టం తప్పదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మంచి సంప్రదాయం
ఇలాంటి సమస్యలు గతంలో పలుమార్లు భారీ చిత్రాలకు ఎదురయ్యాయి. ఆ సమయంలో మంచి ఆలోచనతో మెలగడం వలన నిర్మాతలకు నష్టం తప్పింది. బాహుబలి. శ్రీమంతుడు విడుదల క్లాష్ కావాల్సింది. కానీ నిర్మాతలు మాట్లాడుకుని శ్రీమంతుడు విడుదల ఒక నెల వాయిదా వేసుకున్నారు.
మహేష్, బన్నీ
ఈ ఏడాది సమ్మర్ లో వచ్చిన భరత్ అనే నేను, నాపేరు సూర్య విడుదల విషయంలో కూడా నిర్మాతలు ఈ సంప్రదాయాన్నే కొనసాగించారు. అనుకున్న తేదీ కంటే ఒకవారం ముందుగా భరత్ అనే నేను విడుదలైంది. ఒకవారం ఆలస్యంగా నాపేరు సూర్య విడుదలయ్యేలా నిర్మాతలు సమస్యని పరిష్కరించుకున్నారు. సైరా, మహర్షి విషయంలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారేమో చూడాలి.