Don't Miss!
- News ఏపీలోని ఈ జిల్లాల్లో 44 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు.. ఐఎండీ హెచ్చరిక
- Technology ఏప్రిల్ 23 న షియోమీ లాంచ్ ఈవెంట్! 4 కొత్త పరికరాలు లాంచ్ కాబోతున్నాయి!
- Automobiles చీరకట్టులో బైక్ రైడ్ చేసిన ప్రముఖ నటి.. మండిపడుతున్న నెటిజన్లు - ఎందుకంటే?
- Sports IPL 2024: దినేశ్ కార్తీక్ రికార్డ్ సిక్సర్.. స్టేడియం బయట పడ్డ బంతి! వీడియో
- Lifestyle ఫెయిర్నెస్ క్రీమ్ లు కిడ్నీ సమస్యలను పెంచుతున్నాయి జాగ్రత్త..!
- Travel శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం...
- Finance War Stocks: ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి.. స్టాక్ మార్కెట్లో రెచ్చిపోయిన 14 స్టాక్స్ ఇవే..!!
అసురన్ రీమేక్.. వెరైటీ టైటిల్తో వెంకీ
తమిళ నాట సంచలనం సృష్టించిన అసురన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. సహజత్వానికి దగ్గరగా వెట్రి మారన్ తెరకెక్కించిన అసురన్లో.. అంతే సహజంగా నటించిన ధనుష్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అతడి కెరీర్లోనె బిగ్గెస్ట్ హిట్గా నిలిచి.. దాదాపు 150కోట్లను కొల్లగొట్టిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన అసురన్ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.
తమిళ నాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న అసురన్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని రీమేక్ హక్కులను సురేశ్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. వెంకటేష్ హీరోగా.. అక్కడ మంజువారియర్ చేసిన పాత్రను ప్రియమణి పోషించబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఇటీవలే సెట్స్ పైకి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను అనంతపురంలో చిత్రీకరిస్తున్నట్లు సమచారం. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో వెంకటేశ్తో పాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటారని టాక్. ఈ సినిమాకి 'నారప్ప'అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.