Don't Miss!
- News ఎంపీ ఎన్నికల బరిలో బర్రెలక్క.. ఇంపాక్ట్ ఉంటుందా?
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అదేంటి మహేష్ ఇలా డిసైడ్ అయ్యాడా? మరి ఆ డైరెక్టర్ పరిస్థితేంటో!
సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు. ఊహించిన దానికి భిన్నంగా కొన్ని సందర్భాలు అలా వచ్చేస్తుంటాయి. తాజగా సూపర్ స్టార్ మహేష్కి అలాంటి ఓ సిచ్యుయేషన్ ఎదురైందనేది ఫిలింనగర్ టాక్. మనసు మార్చుకున్న మహేష్ బాబు చివరకు అదే కన్ఫర్మ్ అంటున్నాడట. దీంతో ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తి మొదలైంది. ఆ విశేషాలు పరిశీలిస్తే..
మహర్షి సూపర్ హిట్ తర్వాత
మహేష్ కెరీర్ లో వచ్చిన మహర్షి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా దూసుకుపోతూ రికార్డులు తిరగరాస్తోంది. ఈ నేపథ్యంలో మహేష్ తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి నెలకొంది. మహేష్ 26 గా ఓ కొత్త సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చురుకుగా సాగుతున్నాయి.
త్వరలోనే ముహూర్తం
మహేష్ 26 సినిమాను మే 31న ప్రారంభించేందుకు అన్నీ రెడీ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. ఇదే చిత్రంతో విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. వచ్చేఏడాది మొదట్లోనే ఈ సినిమాను ప్రేక్షాకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆ వెంటనే పరశురామ్ దర్శకత్వంలో మహేష్ మరో సినిమా ఉండనుందని సమాచారం.
ఈ లోగా మనసు మార్చుకున్న మహేష్
అనిల్ రావిపూడి సినిమా పూర్తికాగానే మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సుముఖంగా లేడనేది తాజా సమాచారం. తనకు మహర్షి రూపంలో సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపెల్లి తోనే తన 27 వ సినిమా చేయాలని మహేష్ ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం ఫిలింనగర్ అంతా ఇదే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే మరి పరశురామ్ సంగతేంటనేది ప్రేక్షకుల మదిలో మెదులుతున్న ప్రశ్న. ఈ మధ్యనే పరశురామ్ గీత గోవిందం రూపంలో భారీ హిట్ సొంతం చేసుకున్నారు. ఇలాంటి తరుణంలో డైరెక్టర్ పరశురామ్ తోనే మహేష్ కమిట్ కావడం బెటరనేది కొందరి వాదన.
మహర్షి మూవీ
ఇప్పటికే 150 కోట్ల రూపాయలు వసూలు చేసిన మహర్షి 200 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. వంశీ పైడిపెల్లి రూపొందించిన ఈ సందేశాత్మక చిత్రంలో మహేష్, పూజా హెగ్డే, అల్లరి నరేష్ బాగా ఆకట్టుకున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వీ పొట్లూరి నిర్మాణ విలువలు మహర్షి రేంజ్ పెంచేశాయి.