Don't Miss!
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అనుష్క అప్డేట్.. దర్శకేంద్రుడు సెలెక్ట్ చేసిన ఆ ముగ్గురిలో ఒకరుగా
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ దర్శకులు, ప్రస్తుతం టాలీవుడ్ సినీ రారాజు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇటీవలే తన కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు రాఘవేంద్ర రావు. అంతేకాదు ఈ సినిమా నా కెరీర్లో ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తా అని ట్వీట్ చేశారు రాఘవేంద్ర రావు.
తన తదుపరి సినిమా కోసం ముగ్గురు డైరెక్టర్లు.. ముగ్గురు హీరోయిన్లు పని చేయబోతున్నారని ఆయన తెలిపాడు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాలో నటించనున్న ముగ్గురు హీరోయిన్స్ ఒకరుగా అనుష్కను ఎంపిక చేశారట దర్శకేంద్రుడు. అనుష్క జోడీగా నాగశౌర్య నటిస్తాడని తెలుస్తోంది. ఇక ఇందులో ఒకేసారి మూడు కథలు రన్ అవుతుంటాయట. ఒకదానికొకటి కామన్ రిలేషన్తో సాగే ఈ మూడు కథలకు నాగశౌర్య, అనుష్క పాత్రలకు లింక్ ఉంటుందని సమాచారం. అలాగే మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా నటించనున్నారట. ఈ సినిమాలో క్రిష్ జాగర్లమూడి, బి.వి.ఎస్.రవి, అనీల్ రావిపూడి భాగం కానున్నారని సమాచారం.
కాగా భాగమతి సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అనుష్క.. ప్రస్తుతం సైలెన్స్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తెలుగులో నిశ్శబ్దం పేరుతో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత వెంటనే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మాణంలో తెరకెక్కబోయే కొత్త చిత్రంలో అనుష్క నటించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.