Don't Miss!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
అనుష్క అప్డేట్.. దర్శకేంద్రుడు సెలెక్ట్ చేసిన ఆ ముగ్గురిలో ఒకరుగా
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ దర్శకులు, ప్రస్తుతం టాలీవుడ్ సినీ రారాజు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇటీవలే తన కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు రాఘవేంద్ర రావు. అంతేకాదు ఈ సినిమా నా కెరీర్లో ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తా అని ట్వీట్ చేశారు రాఘవేంద్ర రావు.
తన తదుపరి సినిమా కోసం ముగ్గురు డైరెక్టర్లు.. ముగ్గురు హీరోయిన్లు పని చేయబోతున్నారని ఆయన తెలిపాడు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాలో నటించనున్న ముగ్గురు హీరోయిన్స్ ఒకరుగా అనుష్కను ఎంపిక చేశారట దర్శకేంద్రుడు. అనుష్క జోడీగా నాగశౌర్య నటిస్తాడని తెలుస్తోంది. ఇక ఇందులో ఒకేసారి మూడు కథలు రన్ అవుతుంటాయట. ఒకదానికొకటి కామన్ రిలేషన్తో సాగే ఈ మూడు కథలకు నాగశౌర్య, అనుష్క పాత్రలకు లింక్ ఉంటుందని సమాచారం. అలాగే మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా నటించనున్నారట. ఈ సినిమాలో క్రిష్ జాగర్లమూడి, బి.వి.ఎస్.రవి, అనీల్ రావిపూడి భాగం కానున్నారని సమాచారం.
కాగా భాగమతి సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అనుష్క.. ప్రస్తుతం సైలెన్స్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తెలుగులో నిశ్శబ్దం పేరుతో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత వెంటనే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మాణంలో తెరకెక్కబోయే కొత్త చిత్రంలో అనుష్క నటించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.