Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసిన పూరి.. అందుకే విజయ్ దేవరకొండతో!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో త్వరలో కొత్త సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూరి, చార్మి సంయుక్తంగా నిర్మించబోతున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా విజయంతో జోష్లో ఉన్న పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అయ్యేలా ఈ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఈ ఒక్కసారిగా అందరి కళ్లు ఈ కాంబోపైనే పడ్డాయి. కాగా తాజాగా ఈ సినిమా విషయమై ఓ ఆసక్తికర అప్డేట్ తెలుస్తోంది. ఆ వివరాలు చూద్దామా..
మరింత మాస్ మసాలా.. ఈ సారి అదిరిపోయేలా
మాస్ మసాలా స్టోరీతో 'ఇస్మార్ట్ శంకర్' భారీ హిట్ ఇవ్వడంతో.. ఇకపై మాస్ సినిమాలే చేయాలనే నిర్ణయానికి వచ్చారు పూరి జగన్నాథ్. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండతో పక్కా మాస్ ఎంటర్టైనర్ రూపొందించే పనిలో పడ్డారు. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా స్క్రిప్ట్కి మెరుగులు దిద్దేస్తున్నారు కూడా.
బాక్సర్గా విజయ్ దేవరకొండ.. టైటిల్పై క్లారిటీ
ఇటీవలే ఈ సినిమా టైటిల్ విషయంలోనూ ఓ వార్త బయటకు వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని, అలాగే ఈ చిత్రానికి 'ఫైటర్' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారని వార్తలు వచ్చాయి. ఇందులో బాక్సర్గా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని అన్నారు. దీనిపై అఫీషియల్ సమాచారం బయటకు రాకముందే ఈ సినిమా పూరి కెరీర్లో వచ్చిన ఓ సినిమాకు సీక్వల్ అని మరో సమాచారం షికారు చేస్తోంది.
సిమిలర్ స్క్రిప్ట్ రెడీ చేసిన పూరి
రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూరి.. ఇదే సినిమాకు సిమిలర్ స్క్రిప్ట్ రెడీ చేశారని, ఇందులో కూడా బాక్సింగ్ సన్నివేశాలు అబ్బురపరిచేలా రూపొందించాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇది 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' సీక్వల్ అని కూడా అంటున్నారు కొందరు.
త్వరలోనే పూర్తి సమాచారం
ఇక ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్స్, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే అఫీషియల్గా ప్రకటించనున్నారని తెలుస్తోంది. పూరి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నిర్మించనున్నారు. పూరి, చార్మి నిర్మాతలుగా శ్రీమతి లావణ్య సమర్పణలో ఈ మూవీ తెరకెక్కనుంది.