twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా పండగలా 'సైరా' వేడుకకు సన్నాహాలు.. ముఖ్య అతిథులు ఎవరంటే!

    |

    మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 151వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది సైరా నరసింహా రెడ్డి సినిమా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

    అక్టోబర్ 2 వ తేదీన ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ప్రమోషన్స్ గ్రాండ్ గా నిర్వహించి భారీ హైప్ తీసుకురావాలని ప్లాన్ చేస్తోందట చిత్రయూనిట్. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని మునుపెన్నడూ ఏ చిత్రానికీ చేయని విధంగా అత్యంత గ్రాండ్‌గా చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబందించిన పనులు మొదలు పెట్టేశారని తెలుస్తోంది. హైదరాబాదులో జరగనున్న ఈ మెగా వేడుకకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

     Intresting Update On Sye Raa Narasimha Reddy pre release event

    కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 1857 బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ వేసి ఈ మూవీ రూపొందించడం జరిగింది. చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో గ్రాండ్‌గా అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

    English summary
    Megastar Chiranjeevi's Sye Raa Narasimha Reddy movie creating sensetions before release. As per latest talk this movie pre release event will be very much grandly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X