మహేష్ ట్వీట్ చేయడం బాగానే ఉంది కానీ మగధీరను బీట్ చేసిందనేదే...!?
'మగధీర' సినిమా, ఆ టైంలో ఆ సినిమా టాలీవుడ్ హైయస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసినా ఈ సినిమా ఆఫీషియల్ గా ఎవరూ డిక్లేర్ చేయవలసిన అవసరం రాలేదు. ప్రేక్షకులందరూ ఏకగ్రీవంగా ఒప్పుకోనే రీతిలో కళ్ళముందు కనబడే కలక్షన్స్ సునామీ క్రియేట్ చేసాయి. అయితే ప్రిన్సు మహేష్ బాబు హై వోల్టేజీ యాక్షన్ ఎంటర్టైనర్ 'దూకుడు" హయ్యస్ట్ గ్రాసరర్ గా నిలిచిందని. అత్యధిక వసూళ్లు చేయటంలో ఇప్పటివరకూ 'మగధీర" పేరిట ఉన్న ఈ రికార్డ్ తాజాగా 'దూకుడు" పరమయ్యింది. (మగధీరను దూకుడు కొట్టేసింది) అంటూ నిన్న మహేష్ బాబు చేసిన ట్విట్ కు మగధీర నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు.
'మగధీర రికార్డ్స్ ఇంకో పదేళ్ళ వరకు ఎవరూ టచ్ చేయలేరు' అని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ద్వారా రావాలని, ఆ స్టేట్ మెంట్ ని వినాలని మెగాఅభిమానులు ఆశీస్తున్నారు. అంతే కాదు, మహేష్ బాబు చెప్పిన రెండు అబద్ధాలను అల్లు అరవింద్ ఆఫీషియల్ గా ఖండించాలని కూడా ఆశీస్తున్నారు. మహేష్ బాబు ట్వీట్ చేయడం వరకూ బాగానే ఉంది కానీ మగధీర ను బీట్ చేసిందనేదే మెగా అభిమానులకు రుచించడంలేదు. ఎందకంటే మహేష్ బాబు హిట్ ఈజ్ అఫిషియల్ అని పోస్ట్ చేయడం, రెండది మగధీరను దూకుడు కొట్టేసింది అని చెప్పడం. ఓవరాల్ రన్ లో మగధీర కంటే 15కోట్లు తక్కువ చేసే సినిమాను నాలుగు వారాల్లో మగధీరను కొట్టేసింది అని చెప్పడం ఎలా అంటూ మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి మహేష్ బాబు గురి అవుతున్నాడంటూ గుసగుసలు ప్రచారం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











