Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
జూ ఎన్టీఆర్ రెండు మాస్ సినిమాల మధ్య ఓ క్లాస్ సినిమా..!?
'ఆరెంజ్" దెబ్బతో ఫ్యామిలీకి దూరమైన దర్శకుడు 'బొమ్మరిల్లు" భాస్కర్, నందమూరి క్యాంప్ లో చేరాడంటూ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే..కళ్యాణ్ రామ్ కి భాస్కర్ ఓ కథ చెప్పాడనీ, ఆ కథ నచ్చి కళ్యాణ్ రామ్-భాస్కర్ తో కమిటయ్యాడనీ వార్తలొచ్చాయి. అయితే లేటుగా తేలిన విషయమేంటంటే, నందమూరి క్యాంప్ లో భాస్కర్ అడుగు పెట్టిన మాట వాస్తవమేననీ, అయితే భాస్కర్ కథ చెప్పింది కళ్యాణ్ రామ్ కి కాదు, జూ ఎన్టీఆర్ కి అని తెలిసింది.
బృందావనం" సినిమా తర్వాతే భాస్కర్, ఎన్టీార్ ని కలిసి ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడనీ, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమాకీ, బోయపాటి శ్రీను సినిమాకీ మద్య భాస్కర్ తో సినిమాకి ఎన్టీఆర్ టైమ్ కేటాయించాడనీ తెలుస్తోంది. అంటే రెండు మాస్ సినిమాల మధ్యలో ఓ క్లాస్ సినిమా..అంటూ జూ ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నట్టే సురేందర్ రెడ్డి, భాస్కర్, బోయపాటి శ్రీనులతో వరుస సినిమాలు చేయనున్నాడన్నమాట. ఇదిలా వుంటే, గాసిప్స్ లో తన పేరు విన్పించగానే కంగారు పడ్డ కళ్యాణ్ రామ్, భాస్కర్ ని కలిసి ఓ సినిమా చేద్దామనే ప్రపోజల్ తెచ్చినట్టు సమాచారం.