Don't Miss!
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
జూ ఎన్టీఆర్ రెండు మాస్ సినిమాల మధ్య ఓ క్లాస్ సినిమా..!?
'ఆరెంజ్" దెబ్బతో ఫ్యామిలీకి దూరమైన దర్శకుడు 'బొమ్మరిల్లు" భాస్కర్, నందమూరి క్యాంప్ లో చేరాడంటూ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే..కళ్యాణ్ రామ్ కి భాస్కర్ ఓ కథ చెప్పాడనీ, ఆ కథ నచ్చి కళ్యాణ్ రామ్-భాస్కర్ తో కమిటయ్యాడనీ వార్తలొచ్చాయి. అయితే లేటుగా తేలిన విషయమేంటంటే, నందమూరి క్యాంప్ లో భాస్కర్ అడుగు పెట్టిన మాట వాస్తవమేననీ, అయితే భాస్కర్ కథ చెప్పింది కళ్యాణ్ రామ్ కి కాదు, జూ ఎన్టీఆర్ కి అని తెలిసింది.
బృందావనం" సినిమా తర్వాతే భాస్కర్, ఎన్టీార్ ని కలిసి ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడనీ, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమాకీ, బోయపాటి శ్రీను సినిమాకీ మద్య భాస్కర్ తో సినిమాకి ఎన్టీఆర్ టైమ్ కేటాయించాడనీ తెలుస్తోంది. అంటే రెండు మాస్ సినిమాల మధ్యలో ఓ క్లాస్ సినిమా..అంటూ జూ ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నట్టే సురేందర్ రెడ్డి, భాస్కర్, బోయపాటి శ్రీనులతో వరుస సినిమాలు చేయనున్నాడన్నమాట. ఇదిలా వుంటే, గాసిప్స్ లో తన పేరు విన్పించగానే కంగారు పడ్డ కళ్యాణ్ రామ్, భాస్కర్ ని కలిసి ఓ సినిమా చేద్దామనే ప్రపోజల్ తెచ్చినట్టు సమాచారం.