Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
రామ్ చరణ్ కు 'నంది' రాకపోవటానికి దాసరే కారణమా?
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి రామ్ చరణ్ కి రావాల్సిన నంది అవార్డును అడ్డుకున్నారంటూ పీఆర్పీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ కు ఉత్తమనటుడు అవార్డు రాకపోవడంపై ప్రజారాజ్యం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ పార్టీ నేతలు అంతటా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'మగధీర'కు 9 అవార్డులు వచ్చి ఆ సినిమా హీరోకు ఉత్తమ నటుడు అవార్డు రాకపోవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అలాగే బాక్సాఫీస్ వద్ద ఫెయిలయిన 'మేస్త్రీ' చిత్రానికి గాను ఆయనకు అవార్డు ఎలా వచ్చిందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేగాక మేస్త్రీ సినిమా పైన, అందులో ఆయన నటనపైనా, ఏ ఒక్క పత్రికలోనైనా రివ్యూ వచ్చిందా? అని వారు నిలదీస్తున్నారు. నంది అవార్డులలో పైరవీలూ జరిగి ఉండొచ్చని ఇంకొందరు నేతలు సందేహపడుతున్నారు.
ఇక దాసరి తనకు అవార్డు రావటం పై స్పందింస్తూ...ఇంతవరకూ 'మామగారు', 'సూరిగాడు', 'కంటే కూతుర్ని కను' చిత్రాలకు నటునిగా అవార్డులు తీసుకున్నప్పటికీ ఈ సారి ఈ అవార్డు మాత్రం ప్రత్యేకంగా, కొత్తగా ఉంది. ఎందుకంటే గ్యాప్ తర్వాత నేను నటించిన చిత్రం 'మేస్త్రీ'. ఆ సినిమాకి నటునిగా అవార్డు రావడంతో ఈ జనరేషన్తో నన్ను నేను అప్డేట్ చేసుకున్నట్లయింది అన్నారు.