Don't Miss!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రామ్ చరణ్ కు 'నంది' రాకపోవటానికి దాసరే కారణమా?
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి రామ్ చరణ్ కి రావాల్సిన నంది అవార్డును అడ్డుకున్నారంటూ పీఆర్పీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ కు ఉత్తమనటుడు అవార్డు రాకపోవడంపై ప్రజారాజ్యం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ పార్టీ నేతలు అంతటా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'మగధీర'కు 9 అవార్డులు వచ్చి ఆ సినిమా హీరోకు ఉత్తమ నటుడు అవార్డు రాకపోవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అలాగే బాక్సాఫీస్ వద్ద ఫెయిలయిన 'మేస్త్రీ' చిత్రానికి గాను ఆయనకు అవార్డు ఎలా వచ్చిందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేగాక మేస్త్రీ సినిమా పైన, అందులో ఆయన నటనపైనా, ఏ ఒక్క పత్రికలోనైనా రివ్యూ వచ్చిందా? అని వారు నిలదీస్తున్నారు. నంది అవార్డులలో పైరవీలూ జరిగి ఉండొచ్చని ఇంకొందరు నేతలు సందేహపడుతున్నారు.
ఇక దాసరి తనకు అవార్డు రావటం పై స్పందింస్తూ...ఇంతవరకూ 'మామగారు', 'సూరిగాడు', 'కంటే కూతుర్ని కను' చిత్రాలకు నటునిగా అవార్డులు తీసుకున్నప్పటికీ ఈ సారి ఈ అవార్డు మాత్రం ప్రత్యేకంగా, కొత్తగా ఉంది. ఎందుకంటే గ్యాప్ తర్వాత నేను నటించిన చిత్రం 'మేస్త్రీ'. ఆ సినిమాకి నటునిగా అవార్డు రావడంతో ఈ జనరేషన్తో నన్ను నేను అప్డేట్ చేసుకున్నట్లయింది అన్నారు.