Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘దొరసాని’ ఆ ట్రెండ్ను సృష్టించబోతుందా..?
తెలుగు యంగ్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్, సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కలిసి నటించిన చిత్రం 'దొరసాని'. ఈ సినిమా ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ నెల 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు విశేష స్పందన వస్తోంది. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని, ఇందులో ఫ్రెష్, రియల్ లవ్ను చూపించబోతున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, 'దొరసాని' గురించి ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
'దొరసాని' చిన్న సినిమాగా విడుదలై 100 కోట్ల కలెక్షన్లు రాబట్టిన మరాఠీ సినిమా 'సైరత్'లా మారబోతుందనేదే ఆ వార్త సారాంశం. బాలీవుడ్తో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ సినిమా ఎంతో మందిని ఆలోచింపజేసింది. దీనికి కారణం ఈ సినిమాలో చూపించిన ప్రేమకథే. యూత్ను సినిమా థియేటర్ల వైపు నడిపించడంలో దర్శకుడు నక్రి మంజులే సక్సెస్ సాధించారు.
ఇందులో పేదింటబ్బాయికి, పెద్దింటమ్మాయికి మధ్య ప్రేమకథను చాలా యదార్థంగా చూపించారు. రింకు రాజ్గురు, అకేష్ దోసర్ హీరో హీరోయిన్లుగా నటించారు. అజయ్ అతుల్ సంగీతం అందించారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేసేందుకు నిర్మాతలు పెద్ద యెత్తున్న ప్రయత్నాలు చేశారు. భారీ ధర పెట్టి కొనుగోలు చేయడానికి కూడా ముందుకొచ్చారు.
తెలుగులోనేతై సినిమా ప్రారంభం కూడా కాబోతుందని వార్తలు వచ్చాయి. కానీ, ఆ ప్రాజెక్టు అలాగే ఉండిపోయింది. ఇప్పుడిదే తరహాలో 'దొరసాని' కూడా సక్సెస్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమా విడుదలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.