Don't Miss!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చౌదరితో తప్పు చేస్తున్న బాలకృష్ణ- అభిమానుల ఆగ్రహం...!
'సింహా" చిత్రం తర్వాత నందమూరి నటసింహ బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'పరమవీర చక్ర". డాక్టర్ దాసరి నారాయణరావు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం షూటింగ్లో వుండగానే ఎమ్.ఎల్.కుమార్ చౌదరితో ఓ సినిమా ఒప్పుకున్నాడు బాలకృష్ణ. అయితే ఈ సినిమాకు సంబంధించిన కథ రీసెంట్ గా మురళి చెప్పినప్పుడు బేసిక్ లైన్ మాత్రమే విన్నాడని... పూర్తి స్క్రిప్ట్ వినకుండానే ఈ సినిమాని బాలకృష్ణ ఓ.కె. చేశారని సమాచారం.
అంతే కాదండయ్..ఆ సినిమా ఓపెనింగ్ ని ఆగస్ట్ 12 న పెట్టుకోమంటూ స్వయంగా తానే డేట్ కూడా ఫిక్స్ చేసేసిన బాలయ్య హీరోయిన్ గా హన్సిక బావుంటుందంటూ ఆ దర్శక నిర్మాతలకు అడ్వైజ్ కూడా ఇచ్చారట. సో 'పరమవీర చక్ర" లో మిస్స్ అయిన హన్సికని ఈ సినిమాలో బాలయ్య సరసన చూసే అవకాశముంటుందన్న మాట. అయితే ఈ వార్త విన్న బాలయ్య అభిమానులు మాత్రం... ఇదివరకు ఇలాగే ఫ్రెండ్ షిప్ కోసం లేదా డైరెక్టర్ కి ఉన్న పేరుని దృష్టిలో ఉంచుకుని పూర్తిగా కథ వినకుండా సినిమాలు చేసిదెబ్బ తిన్నాడని మళ్ళీ అదే తప్పు బాలకృష్ణ చేస్తున్నాడని అంటున్నారు.