Don't Miss!
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ఈ సారైనా పవన్ ‘సరదా ’తీరనుందా?
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ హీరోగా 'సరదా 'టైటిల్ తో చిత్రం వస్తుందని చాలా కాలం నుంచి ఊరిస్తున్నారు. మీడియా ద్వారా పుట్టిన ఈ టైటిల్ పవన్ కు నచ్చిందని అదే టైటిల్ తో త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేయబోయే చిత్రం రూపొందనుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు హరే రామ హరే కృష్ణ, జల్సా 2 వంటి టైటిల్స్ వినిపిస్తున్నాయి. అయితే 'సరదా 'టైటిల్... గతంలో పవన్ కళ్యాణ్ చేసిన సూపర్ హిట్ రొమాంటిక్ చిత్రాలు 'ఖుషి ','జల్సా 'తరహాలో ఉంది కాబట్టి ఇదే బావుంటుందని అంటున్నారు. పవన్ సైతం ఈ టైటిల్ వైపే మొగ్గుచూపుతున్నాడని టాక్. అయితే త్రివిక్రమ్ మాత్రం మరికొన్ని టైటిల్స్ చూసి ఫైనల్ గా ఏది బాగున్న టైటిలో అది ఫైనల్ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు.
ఇక 'సరదా 'టైటిల్ తో ఆ మధ్యన పంజా నిర్మాతలు పవన్ తో చిత్రం తీయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే అవేమీ మెటిరియలైజ్ కాలేదు. ఈ కాంబినేషన్ చిత్రం నిర్మించటానికి ప్రోడ్యూసర్ బీవీయస్యన్ ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహించనున్నారు. ఈ మేరకు త్రివిక్రమ్ స్క్రిప్టు ఫైనల్ చేయించుకుని తుది మెరుగులు దిద్దటంలో బిజీగా ఉన్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో జల్సా సినిమా వచ్చి విజయవంతం అయ్యింది. తాజాగా మరో సినిమా తెరకెక్కనుంది. ఈ విషయమై త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాకు కన్పర్మ్ చేసి చెప్పారు. ఆ సినిమా ఎలా ఉంటుందో ఆయన మాట్లాడుతూ...నువ్వు నాకు నచ్చావు తరహా మానవ సంభంధాలతో ఉంటుందన్నారు.అలాగే తెలుగు సంప్రదాయలు,మానవ భాంధవ్యాలు ప్రధానంగా ఇందులో కనిపించేలా కథను రెడీ చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు అనంతరం ఈ చిత్రం ప్రారంభం అవుతుంది.
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈచిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం నవంబర్ లో మొదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ ఇప్పటికే రెడీ అయింది. త్వరలో త్రివిక్రమ్ స్క్రిప్టు వర్కు మొదలు పెట్టనున్నాడని, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా దీన్ని ప్లాన్ చేస్తుననట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో వెల్లడి కానున్నాయి.