Don't Miss!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
'దోచేయ్' కథ కీ 'దూకుడు' కథ కీ దగ్గర పోలిక?
హైదరాబాద్ : నాగచైతన్య హీరో గా నటించిన చిత్రం 'దోచేయ్'. కృతి సనన్ హీరోయిన్. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. ఏప్రిల్ 24న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి ఓ వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అది రూమరా...నిజమా అనేది తెలియటం లేదు. అది మరేదో కాదు..ఈ చిత్రం కథ మహేష్ 'దూకుడు' కథ ని పోలి ఉంటుందనేది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునేదాని ప్రకారం... 'దోచేయ్' కథ ఇలా సాగుతుంది. తన తండ్రి కు చెందిన పగ తీర్చుకోవటానికి విలన్ ని రోడ్డు మీద పడేయటానికి హీరో కంకణం కట్టుకుంటాడు. అందులో భాగంగా ..అతనికి చెందిన ఆస్దిని దొంగతనం చేసి నాశనం చేయాలనుకుంటాడు. అందుకోసం ఓ తెలివైన ప్లాన్ వేస్తాడు. అందుకు బ్రహ్మానందాన్ని బకరా చేస్తాడు. బ్రహ్మానందానికి ఓ షూటింగ్ అని చెప్పి అతని ఇంట్లో ప్రవేశిస్తాడు.
అక్కడ నుంచి బ్రహ్మీని వాడుకుని తన దొంగతనం తెలివిగా పూర్తి చేస్తాడు. అయితే ఇదే కథా కాదా అన్నది మాత్రం తెలియదు. కేవలం ఫిల్మ్ సర్కిల్స్ లోనూ,కృష్ణా నగర్ లోనూ వినపడుతున్న కథ మాత్రం ఇది. ఇదే కథ అయితే మాత్రం దూకుడుకి బాగా దగ్గర పోలిక ఉన్నట్లే కదా.. అయితే సినిమా రిలీజ్ అవకుండా ఎలా నిర్ణయానికి లేదా అంచనాకు వస్తామంటారా..అదీ కరెక్టే.
చిత్రం విషయానికి వస్తే...
నిర్మాత మాట్లాడుతూ ''మనం దోపిడీకి గురి కాకూడదంటే ఎదుటివాడిని దోచేయడమే మార్గం అని నమ్మిన ఓ యువకుడి కథ ఇది. నాగచైతన్య అభినయం అందరినీ అలరిస్తుంది. రోజుకొకటి చొప్పున విడుదల చేస్తున్న పాటలకీ, ప్రచార చిత్రాలకీ మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అందరి అంచనాలను అందుకొనేలా ఉంటుంది'' అన్నారు.
అలాగే... నాగచైతన్య హీరోగా స్వామిరారా టీమ్ తో మా బ్యానర్ లో నిర్మిస్తున్న దోచెయ్ చిత్రాన్ని ఏప్రియల్ 24న సమ్మర్ స్పెషల్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం. అలాగే ఏప్రియల్ రెండో వారంలో లహరి మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియోను గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ కు, టీజర్స్ కు ఎక్స్ ట్రార్డనరీ రెస్పాన్స్ వస్తోంది. అభిమానుల ఎక్సపెక్టేషన్స్ రీచ్ అయ్యేలా, మా బ్యానర్ ప్రతిష్టను మరింత పెంచేలా సుధీర్ వర్మ అద్బుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగ చైతన్య కెరీర్ లోమరో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అన్నారు.
ఈ చిత్రంలో చైతన్య ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో కనిపిస్తాడట. మోసం చేసేవారిని ఘరానా మోసంతో దెబ్బకొట్టే యువకుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడు. అందుకే దీనికి ‘దోచెయ్' అనే టైటిల్ను పెట్టినట్లు సమాచారం.
''ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకరు మోసం చేసేవాడు. మోసపోయేవాడు. నువ్వు రెండో వాడు కాకుండా ఉండాలంటే, మొదటివాడివి అయ్యితీరాల్సిందే..'' ఈ అంశం చుట్టూ తిరిగే కథే మా చిత్రం అంటున్నారు సుధీర్ వర్మ.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్., సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్., ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్., ఆర్ట్: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్., కథ-స్ర్కీన్ప్లే-దర్శకత్వం: సుధీర్వర్మ.