దానిపై మనస్సు లాగితే చాలా కష్టం అంటున్న జూ ఎన్టీఆర్..!?
బైకు మీద హెల్మెట్ పెట్టుకుని ఎవరికంటా పడకుండా బైక్ లో దూసుకుపోవడం అంటే జూ ఎన్టీఆర్ కు, నాగచైతన్యకు బాగా ఇష్టం. ఈ ఇద్దరి దగ్గర స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. ఆ మధ్య జూ ఎన్టీఆర్ హార్లీ డేవిడ్ సన్ బైక్స్ కొన్న విషయం విధితమే. కొద్ది నెలల క్రితం ఎన్టీఆర్ దాన్నితీసుకున్నారు. ఇండియాలో సూపర్ బైక్ హార్డ్లీ డేవిడ్ సన్ ని కొన్న మొదటి కష్టమర్ కూడా జూ ఎన్టీఆరే.
అయూజ్ లాగానే ఎన్టీఆర్ కి కూడా బైక్ రేసింగ్ అంటే ప్రాణం. అయాజుద్దీన్ లాగే ఎన్టీఆర్ కి రెగ్యులర్ గా అవుటర్ రింగ్ రోడ్ లో ఎర్లీ అవర్స్ లో బైక్ రైడింగ్ చేయటం హాబీ. ఆ టైమ్ లో అయితే ఎవరూ గుర్తు పట్టరని ఎన్టీఆర్ వెల్తూంటారు.దాదాపు 20లక్షలపైనే ఈ బైక్ ఖరీదు ఉంటుంది. ఈ బైక్ లో జూ ఎన్టీఆర్ ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టేవారట. కానీ ఇప్పుడీ బైక్ ని చూస్తేనే..దెయ్యాన్ని చూసి భయపడుతున్నట్టు భయపడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి కారణం కోట శ్రీనివాసరావు కొడుకు కోట ప్రసాద్, ఇటీవల అజారుద్దీన్ కొడుకు బైక్ లో వెళుతూ ప్రమాదానికి గురై, మరణించడం అని తెలుస్తోంది.
ఈ ఖరీదు గల బైకులతో పెట్టుకుంటే ప్రాణాలు గల్లంతవుతాయన్నదే జూ ఎన్టీఆర్ భయం అట. అందుకని ఈ బైక్ ని అమ్మేయాలని, లేకపోతే మనసు లాగి ఆబైక్ మీద మోజుతో చక్కర్లు కొడతానని భయపడుతున్నారట. ఎలాగైనా ఈ బైక్ ని వదిలించుకోవాలని తాపత్రయపడుతున్నాడట ఎలాగైన ఈ బైక్ ని వదిలించుకోవాలని తాపత్రయపడుతున్నాడని విశ్వసనీయ వర్గాల నుండి అంది సమాచారం.


Click it and Unblock the Notifications











