అబార్షన్ చేయించుకొన్న స్టార్ హీరోయిన్.. టాప్ హీరోతో కలిసి.. గుట్టుచప్పుడు కాకుండా అంటూ..

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు కెరీర్ కోసం ఎంతటి త్యాగాలకైనా పాల్పడుతారు. గ్లామర్‌గా ఉండటానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. పెళ్లి తర్వాత కూడా తెరపైన శృంగారతారగా, అభిమానుల కలలరాణిగా ఉండాలని పరితపిస్తారు. అందుకోసం తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా జాగ్రత్తలు తీసుకొంటారు. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ పెళ్లాడిన ఓ టాప్ హీరోయిన్ కెరీర్ కోసం పెద్ద సాహసమే చేసిందనే చెప్పాలి. ఆ హీరోయిన్ గురించిన వివరాల్లోకి వెళితే...

బాలీవుడ్ కుటుంబం నుంచి : ఆలియా అద్వానీగా జన్మించి.. కియారా అద్వానీగా మారిన ఈ అందాల భామ మంచి సంపన్న కుటుంబం నుంచి వచ్చింది. బాలీవుడ్‌లో లెజెండ్స్ తాత అశోక్ కుమార్, అంకుల్ సయీద్ జాఫ్రీ లాంటి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొన్నది. ఫగ్లీ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కియారా ఆ తర్వాత వెనుకకు తిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్ హీరోయిన్‌గా మారింది.

Kiara Advani gone for Abortion

ఎంఎస్ ధోని మూవీతో : కియారా నటించిన ఎంఎస్ ధోని బయోపిక్‌తో మంచి గుర్తింపును పొందింది ా తర్వాత వచ్చిన మెషినీ సినిమా మరో మెట్టు ఎక్కించింది. లస్ట్ స్టోరీస్, కళాంక్, కబీర్ సింగ్, గిల్టీ లక్ష్మీ లాంటి సినిమా విజయాలు ఆమెను అగ్ర హీరోయిన్‌గా మార్చింది. షేర్షా సినిమా మరింత క్రేజ్‌ను పెంచింది. ఆ తర్వాత భూల్ భులయ్యా 2, గోవిందా నామ్ మేరా సినిమాలు స్టార్ స్టేటస్‌ను మరింత పెంచాయి.

తెలుగులో టాప్ హీరోలతో : తెలుగులో కూడా కియారా అద్వానికీ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబుతో కలిసి భరత్ అనే నేను సినిమాలో నటించడమే కాకుండా గ్లామర్ పంట పడించింది. ఆ తర్వాత రాంచరణ్‌తో వినయ విధేయ రామ సినిమాలో నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నది. ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే శంకర్, రాంచరణ్ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో నటిస్తున్నది.

Kiara Advani gone for Abortion

బాలీవుడ్ హీరోతో పెళ్లి : షేర్షా సినిమాకు ముందు బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడిన కియారా అద్వానీ.. కొంతకాలం సహజీవనం చేశారు. ఆ తర్వాత ఇటీవల రాజస్థాన్‌లోని ప్రఖ్యాత ప్యాలెస్‌లో వివాహం చేసుకొన్నారు. ముంబై, ఢిల్లీలో భారీ విందును నిర్వహించి బాలీవుడ్ పరిశ్రమను, పారిశ్రామిక వర్గాలకు ఆతిథ్యం ఇచ్చింది. సిద్దార్థ్‌తో కలిసి దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నది.

గర్బాన్ని తొలగించుకొన్నదని ఉమేర్ సంధూ ట్వీట్ : అయితే బాలీవుడ్ క్రిటిక్ ఉమేర్ సంధూ సంచలన రీతిలో ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. కియారా అద్వానీ తన కెరీర్‌ను కాపాడుకొనేందుకు సాహసం చేసింది. ఇటీవల ఆమె గర్బవతి అయింది. అయితే తల్లిగా మారేందుకు ఇష్టపడలేదు. తన కెరీర్ కోసం కడుపులో బిడ్డను త్యాగం చేసింది. ఆమె ఇటీవల అబార్షన్ చేయించుకొన్నది అని ఉమేర్ సంధూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X