Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిజమా, మహేష్ కూడా ఫ్యాక్షనిజమా?
ఫ్యాక్షనిజం అనేది తెలుగు భాక్సాఫీస్ లో బాగా సక్సెస్ అయిన ఫార్ములా. దాదాపు ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన పెద్ద చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి. ఇప్పుడు 'ఆగడు' కథ కూడా రాయలసీమ లోని ఆనంతపూర్ జిల్లా తాడిపత్రి గ్రామం బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని అంటున్నారు. ఇందునిమిత్తం అనంతపురం తాడిపత్రి సెట్ ని గుజరాత్ లో వేసి షూట్ చేస్తున్నారు. తాడిపత్రిలో షూట్ చేస్తే క్రౌడ్ ని కంట్రోల్ చేయటం కష్టమని అక్కడ శ్రీను వైట్ల ఇలా ప్లాన్ చేసాడంటున్నారు. జనవరి 18 నుంచి భారీ షెడ్యూల్ ఇక్కడ జరగనుంది.
శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆగడు'. మహేష్బాబు హీరో. తమన్నా హీరోయిన్. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ''మహేష్బాబు నుంచి అతని అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. మహేష్ పాత్రని దర్శకుడు వైవిధ్యంగా తీర్చిదిద్దారు. ''అన్నారు. సంగీతం: ఎస్.ఎస్. థమన్, ఛాయాగ్రహణం: కె.వి.గుహన్, కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.