Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
టీవీ ఛానెల్స్ తో మోహన్ బాబు?
మోహన్ బాబు త్వరలో టీవీ ఛానెల్స్ పెట్టి మీడియా ప్రవేశించనున్నారని అంతటా వినపడుతోంది. న్యూస్ ఛానెల్ కాకుండా పూర్తి వినోదాత్మకంగా ఈ ఛానెల్ రూపొందించాలని ప్రయత్నం అని తెలుస్తోంది. తన కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఇప్పటికే టీవీ మీడియాలో తన లక్ష్మీ టాక్ షో తో మంచి పేరు తెచ్చుకోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే అశ్వనీదత్ తన కుమార్తె స్వప్న దత్ తో లోకల్ ఛానెల్ పెట్టి విజయం సాధించటం సైతం వీరికి ప్రేరణగా నిలుస్తోందని చెప్తున్నారు. అలాగే వీరు పెట్టబోయే టీవీ ఛానెల్స్ కు ప్రముఖ పారిశ్రామిక వేత్త విసు కన్సలటెన్సీ సి.సి.రెడ్డి గారు కూడా వెనక ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు.
ఆయన మనమరాలు ఈ మధ్యనే మోహన్ బాబు కోడలు అయ్యిందనే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీవీ మీడియా డల్ గా ఉన్నా క్రమశిక్షణకు మారుపేరైన మోహన్ బాబు ఈ వెంచర్ ప్రతిష్టాత్మకంగా భావించి గెలిపించే అవకాశముందని తెలుస్తోంది. అంతేగాక గతంలో దాసరి డి ఛానెల్ ముందుకు వస్తామన్నారు. అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. దాంతో ఆ ఛానెల్ కోసం తయారు చేసిన కొన్ని పోగ్రామ్ లు సైతం వీరు తీసుకునే అవకాశముందని అంటున్నారు. ఇక ఇప్పటికే మోహన్ బాబు కుమారుడు వివిధ టీవీ ఛానెల్స్ కు పోగ్రాములు తయారు చేసి అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వ్యూహాత్మంకంగా మోహన్ బాబు టీవీ రంగంలోకి అడగెట్టి విజయం సాధించాలని కోరుకుందాం.