Don't Miss!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
టీవీ ఛానెల్స్ తో మోహన్ బాబు?
మోహన్ బాబు త్వరలో టీవీ ఛానెల్స్ పెట్టి మీడియా ప్రవేశించనున్నారని అంతటా వినపడుతోంది. న్యూస్ ఛానెల్ కాకుండా పూర్తి వినోదాత్మకంగా ఈ ఛానెల్ రూపొందించాలని ప్రయత్నం అని తెలుస్తోంది. తన కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఇప్పటికే టీవీ మీడియాలో తన లక్ష్మీ టాక్ షో తో మంచి పేరు తెచ్చుకోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే అశ్వనీదత్ తన కుమార్తె స్వప్న దత్ తో లోకల్ ఛానెల్ పెట్టి విజయం సాధించటం సైతం వీరికి ప్రేరణగా నిలుస్తోందని చెప్తున్నారు. అలాగే వీరు పెట్టబోయే టీవీ ఛానెల్స్ కు ప్రముఖ పారిశ్రామిక వేత్త విసు కన్సలటెన్సీ సి.సి.రెడ్డి గారు కూడా వెనక ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు.
ఆయన మనమరాలు ఈ మధ్యనే మోహన్ బాబు కోడలు అయ్యిందనే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీవీ మీడియా డల్ గా ఉన్నా క్రమశిక్షణకు మారుపేరైన మోహన్ బాబు ఈ వెంచర్ ప్రతిష్టాత్మకంగా భావించి గెలిపించే అవకాశముందని తెలుస్తోంది. అంతేగాక గతంలో దాసరి డి ఛానెల్ ముందుకు వస్తామన్నారు. అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. దాంతో ఆ ఛానెల్ కోసం తయారు చేసిన కొన్ని పోగ్రామ్ లు సైతం వీరు తీసుకునే అవకాశముందని అంటున్నారు. ఇక ఇప్పటికే మోహన్ బాబు కుమారుడు వివిధ టీవీ ఛానెల్స్ కు పోగ్రాములు తయారు చేసి అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వ్యూహాత్మంకంగా మోహన్ బాబు టీవీ రంగంలోకి అడగెట్టి విజయం సాధించాలని కోరుకుందాం.