Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
క్రికెటర్ను చెంపదెబ్బ కొట్టిన ప్రియమణి.. అసలేం జరిగిందంటే..
దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తున్న అందాల భామ ప్రియమణి వివాదాలకు, రూమర్లకు దూరంగా ఉంటారు. అప్పట్లో ఓ క్రికెటర్తో వివాదం ఆమెను మీడియాలోకి లాగేలా చేసింది. దాంతో ప్రియమణికి, క్రికెటర్కు ఏం జరిగిందనే విషయం ఆసక్తిగా మారింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) జరిగిన సందర్భంగా జరిగిన సంఘటనను ప్రియమణి వివరిస్తూ...
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సందర్భంగా
సీసీఎల్ సందర్భంగా ఓ క్రికెటర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, చనువుగా కొన్ని ప్రదేశాల్లో టచ్ చేయడానికి ప్రయత్నించడంతో అతడిని ప్రియమణి చెంప దెబ్బ కొట్టింది అనే వార్తలు మీడియాలో అప్పట్లో కనిపించాయి. దేశవ్యాప్తంగా సినీ తారలు పాల్గొన్న అలాంటి టోర్నిలో దక్షిణాది తారకు అవమానం జరిగింది అనే విధంగా కథనాలు వెలువడ్డాయి.
నా మొబైల్ ఫోన్ చోరీ
అయితే ఇలాంటి వార్తలపై ప్రియమణి వివరణ ఇస్తూ.. ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని క్లియర్గా చెబుతాను. ఓ వ్యక్తి నా మొబైల్ ఫోన్ దొంగిలించాడు. ఆ సమయంలో నా సోదరుడి ఫోన్ను వాడుతున్నాను. దొంగిలించిన వ్యక్తి నాతో ప్రాంక్ చేస్తున్నాడు. రకరకాలుగా ఇబ్బంది పెట్టడంతో నాలో కంగారు మొదలైంది. నా ఫోన్ దొంగిలించిన వ్యక్తిని కనిపెట్టమని హోటల్ సిబ్బందిని కోరాను అని ప్రియమణి చెప్పింది.
నా హోటల్కు వచ్చి
ఆ తర్వాత ఫోన్ దొంగిలించిన వ్యక్తి స్వయంగా నా హోటల్ రూంకు వచ్చి కలిశాడు. ఆ వ్యక్తి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. నాతో బిహేవ్ చేసిన విధానం సరిగా లేదని చెప్పాను. ఆ సంఘటన ఓ చేదు అనుభవం లాంటిదే. అయితే తాను అతడిని కొట్టానని వచ్చిన వార్తల్లో నిజం లేదు అని ప్రియమణి చెప్పింది.
Recommended Video
ప్రియమణి కెరీర్ గురించి
దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటిగా రాణిస్తూనే పలు టెలివిజన్ ఛానెల్స్లో రియాలిటీ షోలకు హోస్ట్గా, జడ్జిగా ప్రియమణి వ్యవహరిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న విరాటపర్వం చిత్రంలో, వెంకటేష్ నారప్ప, సిరివెన్నెల, డాక్టర్ 56, అజయ్ దేవగన్ నటిస్తున్న మైదాన్ చిత్రంలో ప్రియమణి కనిపించనున్నది.