Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాజ్ తరుణ్ అన్ని తప్పులు చేశాడా?.. దాని ఫలితమే..
‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్త మావా’, ‘కుమారి 21ఎఫ్’ లాంటి విజయాలతో టాలీవుడ్ లో ఓ రేంజ్ కు చేరుకొన్న ఈ యువ హీరో వేసిన తప్పటడుల వల్లే విజయాలు దూరమయ్యాయనే టాక్ వినిపిస్తున్నది.
సినీ పరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకొంటేనే అగ్రస్థానం దక్కుతుందనే విషయం అందరికి తెలిసిందే. 'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావా', 'కుమారి 21ఎఫ్' లాంటి విజయాలతో టాలీవుడ్ లో ఓ రేంజ్ కు చేరుకొన్న ఈ యువ హీరో వేసిన తప్పటడుల వల్లే విజయాలు దూరమయ్యాయనే టాక్ వినిపిస్తున్నది. రాజ్ తరుణ్ జడ్జిమెంట్ సరిగా లేకపోవడంతో 'ఆడోరకం ఈడోరకం'లాంటి చిత్రాల్లో నటిస్తున్నాడనే రూమర్ ప్రచారం జరుగుతున్నది.
ఇటీవల రాజ్ తరుణ్ వదులుకొన్న చిత్రాలు టాలీవుడ్ ఘన విజయాలు సాధించడమే కాకుండా భారీ కలెక్షన్లను వసూలు చేశాయి. ఈ మధ్య రాజ్ తరుణ్ చేజార్చుకొన్న చిత్రాలు శతమానం భవిత, నేను లోకల్ చిత్రాలు కావడం గమనార్హం. తొలుత శతమానం భవతి కథను శర్వానంద్, సాయిధరమ్ తేజ్ కంటే ముందుగా రాజ్ తరుణ్ కే వినిపించారట. అయితే కథలో కొన్ని మార్పులు చేయాలని సూచించడంతో ఆ చిత్రం చేసే అవకాశం శర్వానంద్ కు చిక్కింది. శర్వానంద్ పేరును దిల్ రాజుకు సాయి ధరమ్ తేజ్ సూచించాడట.
ఇక నాని హీరోగా ఇటీవల విడుదలైన 'నేను లోకల్' కూడా రాజ్తరుణ్ చేయాల్సిందే. ఈ సినిమా ఈ చిత్రం టాలీవుడ్ లోనే కాకుండా అమెరికాలో భారీ వసూళ్లు సాధించింది. ఈ రెండు చిత్రాలు రాజ్తరుణ్ ఖాతాలో పడి ఉంటే.. అతని కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయి ఉండేదని సినీ క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు.