Don't Miss!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Finance EPFO News: ఉద్యోగులకు గుడ్న్యూస్.. మారిన పీఎఫ్ విత్డ్రా రూల్స్.. ఎంతంటే..??
- News YS Jagan: జగన్ పై దాడి కేసులో ఇద్దరి అరెస్ట్-కాసేపట్లో కోర్టుకు..!
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
దసరాకు సైరా రావడం లేదా.. మరి ఎప్పుడంటే. రాంచరణ్ షాకింగ్ నిర్ణయం
ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకొని ప్రెస్టీజియస్ మూవీలో నటిస్తున్నారు. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'సైరా నరసింహా రెడ్డి' చిత్రంతో మన ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విడుదల కోసం మెగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే సైరా సెట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకొన్న నేపథ్యంలో సినిమా దసరాకు వస్తుందా? అని సందేహాలు రేకెత్తాయి. అయితే అలాంటి సందేహాలకు ఝలక్ ఇస్తూ రామ్ చరణ్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇస్తున్నట్టు సమాచారం.
చివరిదశలో సైరా షూటింగ్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చిత్రంలోని హై వోల్టేజ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ షూటింగ్ ఫినిష్ చేసి దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
అక్టోబర్ 2నే విడుదల
అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు మెగా అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ ఈ సినిమాను దసరాకు ముందుగానే అక్టోబర్ 2 వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట దర్శకనిర్మాతలు. ఈ మేరకు ప్రొడక్షన్ కి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడంలో వేగం పెంచేశారని తెలుస్తోంది.
ప్లాన్ కంటే ముందే చిరంజీవి మూవీ
చిరంజీవి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసమే రామ్ చరణ్ ఇలా నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అతిత్వరలో దీనిపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వనుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే అనుకున్నదానికంటే ముందే సిల్వర్ స్క్రీన్ పై చిరంజీవిని చూసి ఎంజాయ్ చేయొచ్చన్నమాట.
చిరంజీవినే ఎవరు మీరు అని ప్రశ్నించా.. ఆయన మాటలతో రోమాలు నిక్కబొడిచాయ్'
హై వోల్టేజ్ సన్నివేశాలతో
భారీ అంచనాల నడుమ హై వోల్టేజ్ సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ డ్రామాలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార, మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, కుచ్చ సుదీప్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకుంది.