Don't Miss!
- News షర్మిల గురి మారిందా - వారి ఆశలపై నీళ్లు, ఫలితం తారుమారు..!!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వెరీ ఇంట్రెస్టింగ్: వరుణ్ చేసేది పవన్ సినిమాకు రీమేక్.. ఆ తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరోల్లో వరుణ్ తేజ్ కొంచెం స్పెషల్ అనే చెప్పాలి. 'ముకుంద' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన మెగా ప్రిన్స్.. ఆ తర్వాతి సినిమాతోనే జాతీయ అవార్డు దక్కించుకున్నాడు. తర్వాత పలు చిత్రాలు అనుకున్నంతగా ఆడలేదు. కానీ, ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపించడం వల్లే ఇది సాధ్యమైంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది. దీంతో అతడు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు బాక్సింగ్ నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..? పూర్తి వివరాల్లోకి వెళితే...
‘గద్దలకొండ గణేష్'తో హిట్ కొట్టాడు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్' సినిమాతో భారీ హిట్ కొట్టాడు. స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో వరుణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే, అతడిని మాస్ ఆడియెన్స్కు దగ్గర చేసిందీ సినిమా.
బాక్సర్గా మారిపోతున్నాడు
భారీ హిట్ సినిమా తర్వాత వరుణ్ తేజ్ మరో సినిమా చేయడానికి సిగ్నల్ ఇచ్చేశాడు. దీనికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించనున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్, అల్లు బాబీ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ విదేశాల్లో శిక్షణ కూడా తీసుకున్నాడు.
భారీ రెమ్యూనరేషన్
వరుస విజయాలను అందుకుంటున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. దీంతో అతడి మార్కెట్ గణనీయంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే అతడి రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిందని అంటున్నారు. ‘గద్దలకొండ గణేష్' వరకు రూ. 5 నుంచి 8 కోట్లు మాత్రమే తీసుకున్న వరుణ్.. ఈ సినిమాకురూ. 10 కోట్లు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది.
ఇది పవన్ సినిమాకు రీమేకా.?
వరుణ్ తేజ్ నటించే ఈ సినిమా పవన్ కల్యాణ్ చేసిన ఓ మూవీకి రీమేక్ అని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా పవన్ కల్యాణ్ నటించిన ‘జానీ' సినిమా ఆధారంగా తెరకెక్కబోతుందట. అయితే, ఆ సినిమాలో చేసిన పొరపాట్లను ఇందులో రిపీట్ కాకుండా జాగ్రత్త పడాలని చిత్ర యూనిట్ భావిస్తుందని టాక్.
Recommended Video
పవన్ సినిమా గురించి
పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘జానీ'. ఈ సినిమాను పవన్ స్వయంగా తెరకెక్కించాడు. దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, ఫైట్స్ కూడా ఆయనే సమకూర్చుకున్నాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో పవన్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.