Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'ఎవడు' కథ కీ రాజమౌళి 'ఈగ' కీ పోలిక??
హైదరాబాద్ : రీసెంట్ గా ఆడియో విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకున్న చిత్రం 'ఎవడు' . ఈ చిత్రం కథ కీ రాజమౌళి 'ఈగ' కీ పోలిక ఉందంటూ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. వారు చెప్పేదాని ప్రకారం .. 'ఈగ' లో నాని చచ్చిపోయి...ఈగ గా పుట్టి విలన్ పై పగ తీర్చుకుంటాడు. నాని మొదటి ఇరవై నిముషాలు ఉంటాడు.
అలాగే.. రామ్ చరణ్ 'ఎవడు' లోనూ... అల్లు అర్జున్ .. ఐదునిముషాలే ఉంటాడుట. సినిమా మొదలైన పది నిముషాల్లో .. అల్లు అర్జున్ ..తీవ్రంగా గాయపడతాడు. దీంతో తన ముఖానికి రామ్ చరణ్ ఫేస్ ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని, తనని ఎవరైతే గాయపరిచి, సమాజానికి కీడు చేయాలనుకున్నారో..వారిపై పగ తీర్చుకుంటాడు.
రాజమౌళి 'ఈగ' లో నాని లేకపోయినా ఎలా నాని సినిమా అంతా ఉన్నట్లు ఫీల్ తెప్పిస్తాడో.. 'ఎవడు' లో అలా అల్లు అర్జున్ కనపడకపోయినా... సినిమా అంతా...అతను ఉన్నట్లే మనకు ఫీల్ వస్తుందని చెప్తున్నారు. హాలీవుడ్ ఫేస్ హాఫ్ చిత్రం నుంచి ప్రేరణ పొంది వస్తున్న ఈ చిత్రం సంచలన విజయం సాధించటం ఖాయం అంటున్నారు.
దిల్ రాజు 'ఎవడు' గురించి మాట్లాడుతూ... వాడి కంట్లో భయం లేదు. ఒంట్లో బెదురు లేదు. దెబ్బకి తిరుగే లేదు. గెలవాలంటే యుద్ధం చేసి తీరాల్సిందే అంటాడు. ఉంటే ఆశలు, పోతే ప్రాణాలే అంటాడు. ఇంతకీ వాడు ఎవడో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు దిల్ రాజు. ఆయన నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'ఎవడు'.
రామ్చరణ్ హీరోగా నటిస్తున్నారు. శ్రుతిహాసన్, అమీజాక్సన్ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో చిత్రీకరణ సాగుతోంది. ఈ నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాత మాట్లాడుతూ ''వినూత్నమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి. రామ్చరణ్ పాత్ర, నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం చిత్రానికి బలాన్నిస్తుంది. అల్లు అర్జున్, కాజల్ పోషించిన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా ఉంటాయి''అన్నారు.