Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్ సినిమాకు జగపతి బాబు తలనొప్పిగా మారాడట?
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై ఈ మధ్య రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో గాసిప్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్న జగపతి బాబు సినిమాకు తలనొప్పిగా మారాడట. జగపతి బాబు వెన్ను నొప్పితో బాధ పడుతున్నాడని, మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకుంటున్నాడని, ఆయన కారణంగా సినిమా షూటింగ్ లేటవుతోందని అంటున్నారు.
మహేష్ తో ప్రాజెక్టు మొదలైన నాటి నుంచి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉండటం...వెంటనే దర్శకుడు కొరటాల శివ ఖండించటం కామన్ అయ్యిపోయింది. ఇటీవల శృతి హాసన్ ఆ ప్రాజెక్టు నుంచి బయిటకు వచ్చిందనే వార్త వచ్చింది. అది రూమర్ అని కొరటాల శివ ఖండించారు. కొరటాల శివ ట్వీట్ చేస్తూ... " శృతి హాసన్ మా ప్రాజెక్టు చేస్తోంది...ఇప్పటికి ఆమె ఓ షెడ్యూల్ పూర్తిచేసింది...డిసెంబర్ 10 నుంచి తర్వాత తదపురి షెడ్యూల్ మొదలవుతుంది..అసలు ఈ గాసిప్స్ ఎక్కడ నుంచి మొదలవుతున్నాయో ." అంటూ వాపోయారు. నదియా, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు కీలకమైన పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.
'ఆగడు' పూర్తయ్యాక మహేష్ సెట్కు వెళుతోంది ఇప్పుడే. దాంతో అందరి దృష్టీ ఈ చిత్రంపై ఉంది. కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్ శైలికి తగ్గట్టుగా మాస్ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.