Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రభాస్తో జగపతిబాబు ఫైట్.. బయటపడ్డ ఆసక్తికర విషయం!
ప్రభాస్ నటించిన 'సాహో' ఆశించిన మేర ఫలితం రాబట్టలేదు. దీంతో తన తదుపరి సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టి సక్సెస్ సాధించాలని కసిగా ఉన్నారు యంగ్ రెబల్ స్టార్. ఈ మేరకు రాధాకృష్ణ దర్శకత్వంలో కమిటైన కొత్త సినిమా సెట్స్పై చురుకుగా కదులుతున్నారు. హై రేంజ్ బడ్జెట్తో యంగ్ రెబల్ స్టార్ కెరీర్లో మరో భారీ సినిమాగా ఈ మూవీ రూపొందుతోందని సమాచారం.
ప్రభాస్ కెరీర్లో 20వ సినిమాగా అలరించబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా తాజాగా చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చింది. ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు కూడా భాగం కానున్నారని తెలుస్తోంది. విలన్గా కీలక పాత్ర పోషించనున్న ఆయన.. ప్రభాస్తో బిగ్ ఫైట్ చేయనున్నారని తెలుస్తోంది.
గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి 'ఓ డియర్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తాజా సమాచారం. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ప్రమోద్, వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కమల్ కన్నన్ ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ విభాగంలో పని చేస్తుండడం విశేషం.