Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దగ్గుబాటి సురేష్ బాబు డెసీజన్పై జాన్వీ, శ్రద్దా ఇంట్రెస్ట్.. ఓకే అన్నాడంటే ఇక..
టాలీవుడ్ బడా నిర్మాత, దివంగత రామానాయుడు తనయుడు దగ్గుబాటి సురేష్ బాబు వైపు బాలీవుడ్ భామలు జాన్వీ కపూర్, శ్రద్దా కపూర్ ఆశగా చూస్తున్నారట. ఎందుకో తెలుసా? ఓ బేబీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్లుగా ఇటీవలే సురేష్ బాబు ప్రకటించడం కారణంగా. ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించడానికి రెడీగా ఉన్నారట ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు.
దక్షిణ కొరియా బ్లాక్ బస్టర్ మూవీ 'మిస్ గ్రానీ'కి రీమేక్ సినిమాగా తెలుగులో వచ్చింది 'ఓ బేబీ' సినిమా. డిఫెరెంట్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ పోషించింది. ఈ చిత్రానికి బీవీ నందిని రెడ్డి దర్శకత్వం వహించగా.. సురేష్ బాబు నిర్మాణ భాద్యతలు చేపట్టారు. ఓ రహస్య స్టూడియోలోకి వెళ్లిన ముసలావిడ తనను తాను ఫొటో తీసుకుంటుంది. ఈ ఫొటో తీసుకున్నాక అకస్మాత్తుగా ఆమె 20 ఏళ్ల అమ్మాయిలా మారిపోతుంది. ఈ నేపథ్యంలో జరిగే ఫన్ ట్రీట్ మెంట్ సినిమానే 'ఓ బేబీ'. ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ సమంత, సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు.
విక్టరీ వెంకటేష్పై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు
మరోవైపు ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని సమంతను 'ఓ బేబీ' సినిమాలో చూడబోతున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది. యంగ్ లేడీగా, గ్రాండ్ మదర్గా సమంత ప్రేక్షకులను మెప్పించబోతోంది. చిత్రంలో సమంత చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుందట. దీంతో ఈ చిత్రంలో సమంత పాత్ర విషయంలో నెలకొన్న ఆసక్తిని గమనించిన జాన్వీ కపూర్, శ్రద్దా కపూర్ ఇద్దరూ హిందీ రీమేక్లో ఆ పాత్ర తమకే దక్కాలని ఆశ పడుతున్నారట.
చూడాలి మరి సురేష్ బాబు నిజంగానే ఈ సినిమాను బాలీవుడ్ తెరపైకి తీసుకెళ్తారా? జాన్వీ, శ్రద్దా ఇంట్రెస్ట్ పై కన్నేస్తారా? అనేది. ప్రస్తుతం వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా రూపొందుతున్న 'వెంకీమామ' సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్నారు సురేష్ బాబు. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.